Telangana: AME డిప్లొమా కోర్సు ప్రారంభం

Read Time:  1 min
Telangana
Telangana
FONT SIZE
GET APP

తెలంగాణ(Telangana) ప్రభుత్వం సాంకేతిక విద్యను మరింత విస్తరించే దిశగా కీలక అడుగు వేస్తోంది. డిప్లొమా ఇన్ ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజినీరింగ్ (AME) కోర్సును ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచే ఒక ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో ఈ కోర్సును ప్రారంభించి, తర్వాత దశలవారీగా ఇతర కాలేజీలకు విస్తరించాలనే యోచనలో ఉంది.

Read Also: PM Modi: విద్యార్థులతో ముఖాముఖి – పరీక్షలపై కీలక సూచనలు

Telangana

పాలిటెక్నిక్ విద్యార్థులకు విమాన రంగంలో కెరీర్ అవకాశాలు

ప్రతి కాలేజీలో 60 మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పించేలా సీట్లను కేటాయించనున్నారు. ఈ కోర్సు ద్వారా విమానాల నిర్వహణ, మరమ్మతులు, భద్రతా తనిఖీలు, ఎయిర్‌క్రాఫ్ట్ సిస్టమ్‌లపై అవగాహన, సర్టిఫికేషన్ ప్రక్రియలు వంటి కీలక అంశాల్లో ప్రాక్టికల్ శిక్షణ ఇవ్వనున్నారు. విమానయాన రంగంలో నైపుణ్యాలున్న టెక్నీషియన్లకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఈ కోర్సు యువతకు మంచి కెరీర్ మార్గాన్ని అందించనుంది.

ఇదే సమయంలో భవిష్యత్ పరిశ్రమ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం(Telangana) సెమీకండక్టర్ టెక్నాలజీ, ఆటోమేషన్ & రోబోటిక్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, ఐఓటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధిత అప్లికేషన్లు వంటి మరో తొమ్మిది ఆధునిక కోర్సులను కూడా ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్టు సమాచారం. ఈ కోర్సులు పరిశ్రమలతో అనుసంధానంగా రూపొందించబడతాయని అధికారులు పేర్కొన్నారు.

ఈ కొత్త కోర్సులతో పాలిటెక్నిక్ విద్యార్థులకు గ్లోబల్ స్థాయి నైపుణ్యాలు అందుతాయని, ప్రైవేట్ మరియు ప్రభుత్వ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని ప్రభుత్వం ఆశిస్తోంది. స్కిల్ డెవలప్‌మెంట్‌కు ప్రాధాన్యత ఇస్తూ యువతను పరిశ్రమలకు సిద్ధం చేయడమే ఈ చర్యల ప్రధాన లక్ష్యంగా అధికారులు తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Pooja

రచయిత గురించి

Pooja

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.