Telangana: ప్రభుత్వ కార్యాలయాల్లో AC వినియోగంపై 25 డిగ్రీల నిబంధన

Read Time:  1 min
Telangana
Telangana
FONT SIZE
GET APP

Telangana: తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ కార్యాలయాల్లో ఎయిర్ కండిషనర్ల వినియోగంపై కీలక ఆంక్షలు విధించింది. ఇకపై అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ACలను కనీసం 25 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్దనే ఉపయోగించాలని ఆదేశాలు జారీ చేసింది. విద్యుత్ వినియోగాన్ని తగ్గించడం, ఖర్చులను నియంత్రించడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.

Read Also:Rajya Sabha Elections: తెలంగాణ నుంచి రాజ్యసభకు ఆ ఇద్దరు ఫిక్స్!

Telangana
Telangana

ప్రభుత్వ శాఖలు, కార్యాలయాలు, వివిధ సంక్షేమ పథకాల అమలుకు సంబంధించిన విద్యుత్ ఖర్చులు ఇటీవలి కాలంలో భారీగా పెరిగాయి. దీంతో డిస్కమ్‌లకు ప్రభుత్వ శాఖల నుంచి రావాల్సిన బకాయిలు భారీగా పేరుకుపోయాయి. కొన్ని నివేదికల ప్రకారం ఈ బకాయిలు దాదాపు ₹48 వేల కోట్ల వరకు చేరినట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో విద్యుత్ వృథాను నివారించేందుకు, ప్రభుత్వ కార్యాలయాల్లో శక్తి వినియోగాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు ఈ నిబంధనలను తప్పనిసరిగా అమలు చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Pooja

రచయిత గురించి

Pooja

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.