Surabhi Medical College Suicide: సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లిలోని సురభి మెడికల్ కాలేజీలో మరో మెడికో ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఫిజియోథెరపీ మొదటి సంవత్సరం చదువుతున్న శ్రీజ (20) తన హాస్టల్ గదిలో ఫ్యానుకు ఉరేసుకుని ప్రాణాలు విడిచింది. ఆదివారం (ఫిబ్రవరి 22) ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
Read Also: MLA Raja Singh Arrested: మెదక్ జిల్లాలో ఎమ్మెల్యే రాజా సింగ్ అరెస్ట్
మేనమామ సంరక్షణలో చదువు..
మృతురాలు పెద్దపెల్లి జిల్లా శ్రీరాంపూర్ మండలం మెడిపెల్లి గ్రామానికి చెందినదిగా పోలీసులు గుర్తించారు. శ్రీజ తల్లిదండ్రులు గతంలోనే మరణించడంతో, ఆమె మేనమామ అండగా ఉండి మెడికల్ విద్యను చదివిస్తున్నారు. ఉన్నత స్థితికి చేరుకుంటుందనుకున్న చిన్నారి ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
Surabhi Medical College Suicide: కాలేజీలో వరుస ఘటనలు – విద్యార్థి సంఘాల ఆందోళన‘
సురభి మెడికల్ కాలేజీలో విద్యార్థుల ఆత్మహత్యలు కలవరపెడుతున్నాయి. గతంలో కూడా ఇక్కడ మెడికోలు ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. తరచూ ఇక్కడ ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడంపై విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. కాలేజీ యాజమాన్యం ఒత్తిడి లేదా ఇతర కారణాలపై సమగ్ర విచారణ జరిపించాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
పోలీసుల విచారణ
సంఘటనా స్థలానికి చేరుకున్న సిద్దిపేట త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శ్రీజ ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని, ఫోరెన్సిక్ ఆధారాలు మరియు తోటి విద్యార్థుల వాంగ్మూలాల ఆధారంగా విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.
hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: