Siddipet: వృద్ధాప్యంలో కన్నతండ్రిని వేధిస్తున్న కొడుకులు.. కేసు నమోదు చేసిన పోలీసులు

Read Time:  1 min
Siddipet: వృద్ధాప్యంలో కన్నతండ్రిని వేధిస్తున్న కొడుకులు.. కేసు నమోదు చేసిన పోలీసులు
FONT SIZE
GET APP

Siddipet: ఆస్తి రాసిచ్చిన తర్వాత కన్నతండ్రిని, తల్లిని పట్టించుకోకుండా, కనీసం తిండి పెట్టకుండా వేధిస్తున్న ఇద్దరు కొడుకులపై చిన్నకోడూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి గంగాపూర్ గ్రామానికి చెందిన కొండి నారాయణరెడ్డి (94) కు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు కలరు. పెద్ద కుమారుడు రాజిరెడ్డి సిద్దిపేటలో వ్యాపారం చేస్తుండగా, చిన్న కుమారుడు పరమేశ్వర్ రెడ్డి గంగాపూర్‌లోనే వ్యవసాయం చేస్తున్నాడు.

Read Also: Armoor Road Accident: ఆటో – స్కూటీ ఢీ.. ఇద్ద‌రు యువ‌కులు స్పాట్ డెడ్

మాటలతో తిడుతూ, చంపుతామని బెదిరింపులు

నారాయణరెడ్డి తనకున్న 7 ఎకరాల భూమిని ఇద్దరు కొడుకులకు సమానంగా (చెరి 3 ½ ఎకరాలు) రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు. వయస్సు పైబడటంతో తమను చూసుకుంటారని ఆస్తిని అప్పగించగా, కొడుకులు మాట మార్చారు. తమను ఒక పాత ఇంట్లో ఉంచి, కనీస సౌకర్యాలు కల్పించకుండా, సరిగ్గా తిండి కూడా పెట్టకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని నారాయణరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఎదురుతిరిగి ప్రశ్నిస్తే బూతు మాటలతో తిడుతూ, చంపుతామని బెదిరిస్తున్నారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.

Siddipet: Police register case against sons harassing father in old age
Siddipet: Police register case against sons harassing father in old age

విషయం తెలుసుకున్న సిద్దిపేట రూరల్ సీఐ శ్రీను, చిన్నకోడూరు ఎస్సై చంద్రమోహన్ మానవత్వంతో స్పందించారు. బాధితుడు పోలీస్ స్టేషన్‌కు రాలేని స్థితిలో ఉన్నందున, అధికారులే నేరుగా నారాయణరెడ్డి నివాసానికి వెళ్లి ఆయన ఫిర్యాదును స్వీకరించారు. నిస్సహాయ స్థితిలో ఉన్న వృద్ధులను వేధించడం చట్టరీత్యా నేరమని, బాధ్యులైన ఇద్దరు కొడుకులపై కేసు నమోదు చేయడం జరిగిందని , చట్టరీత్య తగిన చర్యలు తీసుకుంటామని సీఐ శ్రీను ఈ సందర్భంగా తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Aanusha

రచయిత గురించి

Aanusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.