हिन्दी | Epaper
పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం

CM Revanth Reddy : నేడు మేడారానికి సీఎం రేవంత్ రెడ్డి

Sai Kiran
CM Revanth Reddy : నేడు మేడారానికి సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy : సమ్మక్క-సారలమ్మ జాతర అభివృద్ధి పనులను ప్రారంభించడానికి, అలాగే గద్దెల ప్రాంగణం విస్తరణ మరియు డిజైన్లపై సమీక్ష చేయడానికి సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) మంగళవారం మేడారం రానున్నారు.

ప్రతి రెండేళ్లకోసారి జాతర ప్రారంభానికి ముందు చేపట్టే అభివృద్ధి పనుల శంకుస్థాపన కోసం సీఎం రావడం ఇది తొలిసారి కావడం విశేషం. 2026 జనవరి 28 నుంచి 31వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు జరగనుందని ప్రకటించిన జాతరలో భక్తులకు పలు సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం ఇప్పటికే రూ.150 కోట్లు విడుదల చేసింది. ఈ నిధులతో శాశ్వత అభివృద్ధి పనులు, అలాగే ప్రకృతి దైవాలైన సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెలను ఆధునికీకరించేందుకు ప్రణాళికలు రూపొందించారు.

ప్రస్తుతం సమ్మక్క, సారలమ్మ గద్దెలు ఒక వరుసలో ఉంటున్నాయి. భక్తులు క్యూ లైన్‌లో సమ్మక్క, సారలమ్మ దర్శించుకుని, తరువాత పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెల వద్దకు రావడం ఇబ్బందికరంగా మారింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు నలుగురు గద్దెలను ఒకే వరుసలో నిర్మించాలనుకుంటున్నారు. గద్దెల చుట్టూ ఉన్న ఇనుప గ్రిల్స్‌ను తొలగించి, వాటిని గ్రానైట్‌తో నిర్మించాలనుకుంటున్నారు.

గిరిజన పూజారుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని, నాలుగైదు రకాలుగా గద్దెల డిజైన్లు రూపొందించారు. సీఎం రేవంత్‌ సమీక్షలో ఒక డిజైన్‌ను ఖరారు చేసి, శంకుస్థాపన చేయనున్నారు. ప్రస్తుతం 32 గుంటల్లో తల్లుల గద్దెల ప్రాంగణం ఉండగా, నాలుగు వైపులా మరో 20 అడుగుల మేర విస్తరించాలని భావిస్తున్నారు. గద్దెల విస్తరణ, అతిథి గృహాల నిర్మాణానికి మొత్తం 23 ఎకరాల భూమిని సేకరించనున్నారు.

జంపన్న వాగుపై నీరు ఎప్పటికీ నిలిచేలా రెండు, మూడు చోట్ల చెక్ డ్యామ్‌లు నిర్మించాలన్న ప్రతిపాదనలు ఉన్నప్పటికీ, గత అనుభవాల కారణంగా కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. భక్తుల విశ్వాసాలకు భంగం కలగకుండా జంపన్న వాగులో నిరంతం నీరు ప్రవహించేలా ప్రణాళిక రూపొందించాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

సీఎం పర్యటనలో భాగంగా ఐలాపూర్ వరకు రోడ్డు నిర్మాణం, జాతర ప్రాంతంలో సీసీ రోడ్లు, డ్రెయినేజీలు, ఇతర అభివృద్ధి పనుల భూమి పూజ చేయనున్నారు.

మేడారం ఆలయ విస్తరణపై సూచనలు

మేడారం ఆలయ విస్తరణపై అధికారులు, మాస్టర్ ప్లాన్ గురించి సీఎం రేవంత్‌రెడ్డి పలు సూచనలు చేశారు. ఆలయ ఆవరణలోని చెట్లను సంరక్షించుకుంటూనే విస్తరణను కొనసాగించాలని సూచించారు. జాతరలో 2026 మహా జాతర ప్రారంభానికి ముందు అన్ని పనులు పూర్తవ్వాలని అధికారులకు ఆదేశించారు.

అలాగే, సమ్మక్క-సారలమ్మ గద్దెల ప్రాంగణం విస్తరణ, పునర్నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా అమ్మవార్లకు సీఎం రేవంత్‌రెడ్డి 68 కేజీల బంగారం సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Read also :

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

తలసానిపై కేసు.. వివాదం ఏంటి?

తలసానిపై కేసు.. వివాదం ఏంటి?

సంక్రాంతి స్పెషల్ బస్సులు.. TGSRTC కి రూ.100 కోట్ల ఆదాయం

సంక్రాంతి స్పెషల్ బస్సులు.. TGSRTC కి రూ.100 కోట్ల ఆదాయం

మున్సిపాలిటీ పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్

మున్సిపాలిటీ పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్

బైక్‌పై వెళ్తున్న వ్యక్తి ప్రాణం తీసిన చైనా మాంజా

బైక్‌పై వెళ్తున్న వ్యక్తి ప్రాణం తీసిన చైనా మాంజా

ఐదేళ్ల పాపపై అఘాయిత్యానికి పాల్పడ్డ మాజీ సర్పంచ్

ఐదేళ్ల పాపపై అఘాయిత్యానికి పాల్పడ్డ మాజీ సర్పంచ్

అల్వాల్‌లో కార్ల షోరూంలో భారీ అగ్నిప్రమాదం
0:11

అల్వాల్‌లో కార్ల షోరూంలో భారీ అగ్నిప్రమాదం

త్వరలో 10 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

త్వరలో 10 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

పండ‌గకు ఊరెళ్తూ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ దుర్మరణం
0:21

పండ‌గకు ఊరెళ్తూ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ దుర్మరణం

సంక్రాంతికి తప్పక దర్శించాల్సిన 6 పుణ్యక్షేత్రాలు ఇవే!

సంక్రాంతికి తప్పక దర్శించాల్సిన 6 పుణ్యక్షేత్రాలు ఇవే!

వీధికుక్కల సామూహిక మృతి ఘటన కలకలం

వీధికుక్కల సామూహిక మృతి ఘటన కలకలం

డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు

డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు

సన్నరకం ధాన్యానికి క్వింటాకు రూ.500 బోనస్

సన్నరకం ధాన్యానికి క్వింటాకు రూ.500 బోనస్

📢 For Advertisement Booking: 98481 12870