సమ్మక్క–సారాలమ్మ మహా జాతరకు భక్తులు కుటుంబ సమేతంగా మేడారానికి భారీగా తరలివెళ్తున్నారు. బుధ, గురు, శుక్రవారాల్లో జరిగే ఈ జాతరకు సుమారు 2.50 లక్షల మంది భక్తులు వస్తారని ఆర్టీసీ అంచనా వేస్తోంది. భక్తుల సౌకర్యార్థం 240 ప్రత్యేక బస్సులను ఆర్టీసీ నడుపుతోంది. తెలంగాణలోనే అతిపెద్ద గిరిజన జాతరగా మేడారం (Medaram) జాతరకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రతి రెండేళ్లకు ఒకసారి జరిగే ఈ జాతరకు దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తారు.
Read also: TG: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. భట్టి విక్రమార్క కీలక ప్రకటన!

Devotees express anger over the collection of tickets for goats
బస్సుల సంఖ్య ఉన్నా సౌకర్యాల లోపం
కొత్తగూడెం డిపో నుంచి 110 బస్సులు నడుపుతున్నప్పటికీ, సరైన సౌకర్యాలు లేవని భక్తులు వాపోతున్నారు. బస్సుల్లో కిక్కిరిసిన రద్దీ, సరైన కూర్చునే స్థలం లేకపోవడం ప్రధాన సమస్యలుగా చెబుతున్నారు. మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని భక్తుల ఆవేదన. ప్రయాణ సమయంలో తాగునీరు, శుభ్రత వంటి మౌలిక వసతులు అందడం లేదని ఆరోపిస్తున్నారు. జాతర వంటి పవిత్ర సందర్భంలో మరింత మెరుగైన ఏర్పాట్లు అవసరమని వారు కోరుతున్నారు.
మేకలకు టికెట్ వసూలుపై భక్తుల ఆగ్రహం
జాతరకు మొక్కుబడులు తీర్చుకునేందుకు మేకలను తీసుకెళ్లే భక్తుల నుంచి ఒక్కో మేకకు రూ.350 టికెట్ వసూలు చేయడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇది భక్తులపై అదనపు భారం మోపినట్టేనని వారు అంటున్నారు. దేవతలకు సమర్పించే మేకలకు టికెట్ విధించడం అన్యాయమని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఆర్టీసీ నిర్ణయంపై పునఃపరిశీలన చేయాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. అధికారుల స్పందన కోసం భక్తులు ఎదురుచూస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: