📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Revanth Reddy:అత్యంత శ‌క్తిమంతుల జాబితాలో రేవంత్ రెడ్డి..

Author Icon By Anusha
Updated: March 29, 2025 • 12:50 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇండియా లో 2025 సంవత్సరానికి అత్యంత శక్తివంతమైన 100 మంది వ్యక్తుల జాబితా విడుదలైంది. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ రూపొందించిన ఈ జాబితాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మొదటి స్థానంలో నిలిచారు. ఈ జాబితాలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 28వ స్థానం దక్కించుకోవడం విశేషం.2024 జాబితాలో 39వ స్థానంలో ఉన్న రేవంత్ రెడ్డి, ఏడాదిలోనే 11 స్థానాలు ఎగబాకి 28వ ర్యాంక్ సాధించడం ప్రత్యేక ఆకర్షణగా మారింది.

తెలంగాణ అభివృద్ధి

రైతు, మహిళా సంక్షేమం, యువత భవిష్యత్తు కోసం అనేక వినూత్న కార్యక్రమాలు ప్రవేశపెట్టడం రేవంత్ రెడ్డికి జాతీయ స్థాయిలో గుర్తింపుని అందించింది.రైతు కుటుంబాలకు రూ. 21,000 కోట్ల రుణమాఫీ,క్వింటాల్ ధాన్యానికి రూ.500 బోనస్,మహిళా స్వయం సహాయక సంఘాలకు సోలార్ పవర్ ప్లాంట్లు, పెట్రోల్ బంక్‌లు, ప్రీమియం రిటైల్ స్టోర్లు ఏర్పాటు,యువత నైపుణ్యాభివృద్ధి కోసం ‘యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ’ స్థాపన,ట్రాఫిక్ పోలీస్ విభాగంలో ట్రాన్స్‌జెండర్‌లకు ఉద్యోగావకాశాలు,

రేవంత్ రెడ్డి ర్యాంక్ పెరగడానికి కారణాలు

తెలంగాణ రాష్ట్ర పాలనలో తీసుకున్న కీలక నిర్ణయాలు,రాజకీయ వ్యూహాలు, పాలనలో తీసుకువచ్చిన మార్పులు,తెలంగాణను అభివృద్ధి దిశగా నడిపించే చర్యలు,దేశవ్యాప్తంగా వివిధ అంశాలపై స్పష్టమైన, ధైర్యమైన అభిప్రాయాలను వ్యక్తపరచడం.

రాజకీయాల్లో రేవంత్ రెడ్డి ప్రభావం

నియోజకవర్గాల పునర్విభజనపై చెన్నై సదస్సులో రేవంత్ రెడ్డి గట్టిగా స్పందించడం,ప్రాంతీయ అవసరాలను జాతీయ ప్రాధాన్యతతో సమన్వయం చేయగల మేధో సంపత్తి కలిగిన నాయకుడిగా గుర్తింపు పొందడం,ఇండియా కూటమిలోని ఇతర ముఖ్యమంత్రులతో నిలబడి కీలక నేతగా ఎదగడం.ఈ జాబితాలో రేవంత్ రెడ్డి స్థానం పొందడం, భారతీయ రాజకీయాల్లో ప్రధాన మార్పుకు సంకేతమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ప్రాంతీయ నాయకులు ఇప్పుడు జాతీయ విధానాల రూపకల్పనలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.

పీసీసీ అభిప్రాయం

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ మాట్లాడుతూ,”ఈ గుర్తింపుతో రేవంత్ రెడ్డిపై ప్రజల బాధ్యత మరింత పెరిగింది. పారదర్శక పాలన, రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం ఆయన కృషి చేస్తున్న కారణంగా ఈ గుర్తింపు లభించింది” అని తెలిపారు.భారతదేశ అత్యంత శక్తివంతమైన వ్యక్తుల జాబితాలో రేవంత్ రెడ్డి 28వ స్థానం పొందడం, ఆయన జాతీయ రాజకీయాల్లో కీలక నాయకుడిగా ఎదుగుతున్నడన్నదానికి నిదర్శనం. భవిష్యత్తులో ఆయన మరింత పెద్ద పాత్ర పోషించే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.ఒక ప్రాంతీయ నాయ‌కుడినే కాకుండా దేశంలోనే అత్యంత శక్తిమంతమైన, చురుకైన ముఖ్యమంత్రుల్లో ఒక‌రిగా ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆవిర్భ‌వించారనిచెప్పుకొవచ్చు. శ‌క్తిమంతులైన వంద మంది జాబితాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మొదటి 10 స్థానాల్లో ఉన్నారు.

#IndianPolitics #IndiaPowerList2025 #MostPowerfulIndians #RevanthReddy #TelanganaCM #TheIndianExpress Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.