हिन्दी | Epaper
అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

Ramchandar Rao: అసమ్మతి నేతలను హెచ్చరించిన బీజేపీ చీఫ్

Anusha
Ramchandar Rao: అసమ్మతి నేతలను హెచ్చరించిన బీజేపీ చీఫ్

తెలంగాణ బీజేపీలో ఇటీవల అసమ్మతి స్వరాలు పెరిగిన వేళ, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు తీవ్రంగా స్పందించారు. పార్టీ క్రమశిక్షణ, సిద్ధాంతాల పట్ల ఎలాంటి మినహాయింపూ ఉండదని స్పష్టం చేశారు. “బీజేపీ ఒక దృఢమైన సిద్ధాంతంతో నడిచే పార్టీ. ఇందులో ప్రతి కార్యకర్త క్రమశిక్షణకు కట్టుబడి ఉండాల్సిందే” అని ఆయన స్పష్టం చేశారు.పార్టీలో క్రమశిక్షణకు కట్టుబడి ఉండాల్సిందేనని, నిబంధనలు పాటించకుంటే ఎంతటి నాయకుడిపై అయినా చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోమని ఆయన గట్టిగా హెచ్చరించారు. పార్టీ నుంచి ఎవరు వెళ్లిపోయినా నష్టపోయేది ఏమీ లేదని ఆయన తేల్చిచెప్పారు.శుక్రవారం ఆయన మాట్లాడుతూ, “బీజేపీ (BJP) లో సిద్ధాంతం, క్రమశిక్షణ ముఖ్యం. పార్టీ కంటే ఏ ఒక్క నాయకుడూ గొప్ప కాదు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి” అని స్పష్టం చేశారు.

ప్రాధాన్యతను సంతరించుకున్నాయి

పార్టీ నియమాలను ఉల్లంఘించినందుకు ఒకప్పుడు భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుడైన బల్ రాజ్ మదోక్‌ను సైతం సస్పెండ్ చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. పార్టీ నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన పునరుద్ఘాటించారు.ఇటీవల గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర అసంతృప్తితో పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇలాంటి తరుణంలో రామచందర్ రావు (Ramachandar Rao) వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న సభపై కూడా ఆయన తన సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’ ద్వారా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ సభ కేవలం సామాజిక న్యాయాన్ని దెబ్బతీయడానికేనని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ దోపిడీకి తెలంగాణ ఒక అక్షయపాత్రగా మారిపోయిందని రామచందర్ రావు వ్యాఖ్యానించారు.

Ramchandar Rao: అసమ్మతి నేతలను హెచ్చరించిన బీజేపీ చీఫ్
Ramchandar Rao: అసమ్మతి నేతలను హెచ్చరించిన బీజేపీ చీఫ్

గతంలో ఎమర్జెన్సీ

ఎన్నికల సమయంలో గ్యారెంటీలు, హామీల పేరుతో ఆర్భాటం చేసిన కాంగ్రెస్, వాటిని అమలు చేయడంలో మాత్రం విఫలమైందని దుయ్యబట్టారు. బీసీ వర్గాలకు తీవ్ర అన్యాయం చేయడమే కాకుండా, ఎస్సీ, ఎస్టీలకు సంకెళ్లు వేసి ఇప్పుడు భీమ్ పేరుతో నాటకాలాడుతోందని ఆయన మండిపడ్డారు. గతంలో ఎమర్జెన్సీ (Emergency) విధించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన చరిత్ర కాంగ్రెస్‌కు ఉందని రామచందర్ రావు అన్నారు. ‘జై బాపు, జై భీమ్, జై సంవిధాన్’ వంటి నినాదాలకు తూట్లు పొడిచి, న్యాయాన్ని, రాజ్యాంగ విలువలను కాంగ్రెస్ పార్టీ కాలరాస్తోందని ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Ranga Reddy: అయ్యో! జేబులో పేలిన సెల్ ఫోన్.. గాయపడిన యువకుడు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

వెలుగుమట్ల బాధితులకు న్యాయం చేస్తాం: పొంగులేటి

వెలుగుమట్ల బాధితులకు న్యాయం చేస్తాం: పొంగులేటి

విద్యాశాఖపై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష

విద్యాశాఖపై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష

తెలంగాణ జర్నలిస్టుల అక్రిడిటేషన్ గడువు పొడిగింపు

తెలంగాణ జర్నలిస్టుల అక్రిడిటేషన్ గడువు పొడిగింపు

టీచర్ల పనితీరు ఆధారంగా ప్రమోషన్లు

టీచర్ల పనితీరు ఆధారంగా ప్రమోషన్లు

కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ముఠా గుట్టురట్టు.. 4000 కేజీలు స్వాధీనం
1:28

కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ముఠా గుట్టురట్టు.. 4000 కేజీలు స్వాధీనం

హార్వర్డ్ ను హైదరాబాద్ కు తీసుకొస్తున్నాం – సీఎం రేవంత్

హార్వర్డ్ ను హైదరాబాద్ కు తీసుకొస్తున్నాం – సీఎం రేవంత్

కాంగ్రెస్ కూలగొట్టిన చోటే..ఇళ్లు కట్టిస్తాం – కేటీఆర్

కాంగ్రెస్ కూలగొట్టిన చోటే..ఇళ్లు కట్టిస్తాం – కేటీఆర్

అమీన్‌పూర్‌లో ప్రభుత్వ భూముల కబ్జా

అమీన్‌పూర్‌లో ప్రభుత్వ భూముల కబ్జా

దరఖాస్తులు పెండింగ్లో పెట్టొద్దు: హరీష్ రావు

దరఖాస్తులు పెండింగ్లో పెట్టొద్దు: హరీష్ రావు

ఒకే జిల్లాకు భార్య కలెక్టర్, భర్త ఎస్పీ

ఒకే జిల్లాకు భార్య కలెక్టర్, భర్త ఎస్పీ

కొత్త సర్పంచులకు ‘పాత’ బిల్లుల కష్టాలు

కొత్త సర్పంచులకు ‘పాత’ బిల్లుల కష్టాలు

తండ్రి మందలించడంతో 12 ఏళ్ల విద్యార్థి ఆత్మహత్య

తండ్రి మందలించడంతో 12 ఏళ్ల విద్యార్థి ఆత్మహత్య

📢 For Advertisement Booking: 98481 12870