📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Raja Singh: బండి సంజయ్‌పై బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలు.. రాజాసింగ్ ఏమన్నారంటే?

Author Icon By Anusha
Updated: June 23, 2025 • 6:49 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ఇప్పుడు తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపుతోంది.కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన భారీ అవినీతి గురించి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ఆధారాలతో సహా వివరాలు వెల్లడించగానే, బీఆర్ఎస్ నాయకులు అసంబద్ధమైన ఆరోపణలు చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ (Raja Singh) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, బండి సంజయ్‌పై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు నూటికి నూరు శాతం అవినీతిమయమైన ప్రాజెక్టేనని ఆయన పునరుద్ఘాటించారు.కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో మా పార్టీది, మా అందరిదీ ఒకే మాట. ఈ ప్రాజెక్టు అవినీతిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP nadda) గతంలో చేసిన వ్యాఖ్యలకే మేము కట్టుబడి ఉన్నాం” అని రాజాసింగ్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నాయకుల తీరు చూస్తుంటే ‘దొంగే దొంగ అన్నట్లుగా’ ఉందని ఆయన ఎద్దేవా చేశారు.

Raja Singh

కాళేశ్వరం ప్రాజెక్టును

ప్రధాని మోదీ చెప్పినట్లుగా, బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును తమ ఏటీఎంగా మార్చుకున్నది నిజం కాదా? అని ప్రశ్నించారు. “కేవలం రూ.8 వేల కోట్లతో పూర్తి కావాల్సిన ప్రాజెక్టును రీడిజైనింగ్ పేరుతో ఏకంగా రూ.1.20 లక్షల కోట్లకు పెంచిన మాట వాస్తవం కాదా?” అని నిలదీశారు.అప్పట్లో కేసీఆర్ (KCR) తనకు తానే ఇంజినీర్‌గా ప్రకటించుకుని కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టారని విమర్శించారు. ఇప్పుడు ఆయన కుమారుడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ) కంటే తానే గొప్ప మేధావి అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారని రాజాసింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ (Bandi Sanjay) లేవనెత్తిన అంశాలకు సమాధానం చెప్పకుండా వ్యక్తిగత దూషణలకు దిగడం బీఆర్ఎస్ నేతల ఓటమికి నిదర్శనమని ఆయన అన్నారు.

Read Also: Murder: ప్రియుడి కోసం భర్తను హతమార్చిన నవ వధువు

#BandiSanjay #BJPvsBRS #CorruptionExposed #KaleshwaramProject #KaleshwaramScam #RajaSingh Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.