Raghunandan: బిజెపి నేత రఘునందన్ కు భద్రత హెచ్చింపు

Read Time:  1 min
Raghunandan: బిజెపి నేత రఘునందన్ కు భద్రత హెచ్చింపు
FONT SIZE
GET APP

Medak: మెదక్ ఎంపీ, బీజేపీ నేత రఘునందన్ రావుకు (Raghunandan) భద్రత పెంచాలని తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ నిర్ణయించింది. ఇటీవల ఆయనకు మావోయిస్టుల పేరుతో బెదిరింపు కాల్ వచ్చిన విషయంవిదితమే. ఈ ఘటనపై క్షుణ్ణం గా దర్యాప్తు చేసిన పోలీసు శాఖ, రఘునందన్ రావుకు అదనపు భద్రత కల్పించాల్సిన అవసరం ఉందని నిర్ధారించింది. ఈ నేపథ్యంలో, రఘునందన్ రావు (Raghunandan) పర్యటనల సమయంలో పోలీసు ఎస్కార్ట్ను ఏర్పాటు చేయాలని పోలీసులు బిజెపి (BJP) నేత రఘునందన్ కు భద్రత హెచ్చింపు శాఖ నిర్ణయించింది. ఈ మేరకు మెదక్ (Medak) పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ముగ్గురు పోలీసు సూపరింటెండెంట్లకు ఉన్నతాధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. పీపుల్స్ వార్ మావోయిస్టునంటూ గుర్తు తెలియని వ్యక్తి రఘునందన్ రావు కు ఫోన్ చేసి బెదిరించాడు. సోమవారం సాయంత్రంలోగా హతమారుస్తామంటూ ఆగంతకుడు హెచ్చరించాడు. తాను మధ్యప్రదేశ్ కు చెందిన మావోయిస్టునని ఆ వ్యక్తి పేర్కొన్నాడు. మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడలోని ఒక ప్రైవేటు పాఠశాలలో జరిగిన కార్యక్రమానికి ఎంపీ రఘునందన్రావు హాజరైన సమయంలో ఈ బెదిరింపు కాల్ వచ్చింది. ఆ సమయంలో రఘునందన్ రావు పీఏ ఫోన్ మాట్లాడారు. బెదిరింపు నేపథ్యంలో రఘునందన్ రావు డీజీపీ, మెదక్ జిల్లా ఎస్పీ, ఇతర పోలీసు అధికారులకు ఫిర్యాదు చేశారు.

Read also: Phone Tapping Case : ఈరోజు రాధాకృష్ణ, విశ్వేశ్వర్ రెడ్డి వాంగ్మూలం

Ramya

రచయిత గురించి

Ramya

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.