📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు

ప్రణయ్ తండ్రి బాలస్వామి స్పందన

Author Icon By Vanipushpa
Updated: March 10, 2025 • 5:14 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

2018లో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో నిందితులకు శిక్ష ఖరారు చేస్తూ నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు వెలువరించిన తీర్పుపై తండ్రి బాలస్వామి స్పందించారు. ప్రణయ్ హత్య కేసులో ఏ2 నిందితుడు సుభాష్ కుమార్ శర్మకు ఉరిశిక్షను, మిగిలిన నిందితులకు జీవితఖైదు విధిస్తూ కోర్టు తీర్పును వెలువరించింది. ఈ తీర్పుపై ప్రణయ్ తండ్రి బాలస్వామి స్పందించారు.

నేరస్తులకు కనువిప్పు

ఈ తీర్పుతో నేరస్తులకు కనువిప్పు కలగాలని అన్నారు. ప్రణయ్ హత్యతో తాము చాలా కోల్పోయామని, ఇలాంటి హత్యలు జరగడం విచారకరమని అన్నారు. ఈ తీర్పుతో అయినా పరువు హత్యలు ఆగిపోవాలని ఆకాంక్షించారు. తన కొడుకు ప్రణయ్ హత్య జరిగినప్పుడు ఇదే చివరిది కావాలని కోరుకుంటూ ‘జస్టిస్ ఫర్ ప్రణయ్’ పేరిట పోరాటం చేశామని గుర్తు చేశారు. కానీ ఆ తర్వాత కూడా పలు హత్యలు చోటు చేసుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కులాన్ని పట్టుకొని వేలాడే వారికి, కుల దురహంకారంతో కూతుళ్లను చంపుకునే వారికి ఈ తీర్పు కనువిప్పు కావాలని కోరుకుంటున్నామని అన్నారు. ప్రణయ్ హత్యతో తమకు కొడుకు లేకుండా, అమృతకు భర్త లేకుండా పోయాడని, మారుతిరావు కూడా ఆత్మహత్య చేసుకున్నాడని గుర్తు చేశారు.

ఏడుగురు నేరస్తులకు జైలుశిక్ష

ఈ కేసులోని ఏడుగురు నేరస్తులకు జైలుశిక్ష పడిందని, వీరికి శిక్షపడినందుకు వారి కుటుంబాలు కూడా బాధపడుతూనే ఉంటాయని, కాబట్టి సుపారి తీసుకొని హత్యలు చేసే వారికి ఇది ఒక కనువిప్పు కావాలని ఆయన అన్నారు. ఏదైనా సమస్య ఉంటే చర్చించుకొని, పరిష్కరించుకోవాలని వ్యాఖ్యానించారు. కానీ హత్యలు సరికాదని అన్నారు. న్యాయం కోసం పోరాడుతున్న తమను ప్రలోభాలకు గురి చేసే ప్రయత్నాలు చేసినప్పటికీ తలొగ్గలేదని అన్నారు. ఈ కేసు విచారణ ఆలస్యమవుతుందని చాలామంది అనుమానం వ్యక్తం చేశారని, కానీ పోలీసులు పకడ్బందీగా ఛార్జిషీట్ దాఖలు చేశారని కొనియాడారు. ఈ కేసులో న్యాయం జరగడానికి నాటి ఎస్పీ రంగనాథ్ కూడా సహకరించారని అన్నారు. ఈరోజు వచ్చిన తీర్పుతో న్యాయం జరిగిందని అన్నారు. మీకు న్యాయం జరిగినందుకు సంతోషంగా ఉందా? అని అందరూ అడుగుతున్నారని, కానీ కొడుకులేని లోటును ఎవరూ తీర్చలేరని కంటతడి పెట్టారు.

#telugu News Ap News in Telugu Balaswamy's response Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Pranay's father Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.