📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Indiramma House: ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో అక్రమాలు జరిగితే ఉద్యోగాల నుండి తొలగిస్తాం: మంత్రి పొంగులేటి

Author Icon By Anusha
Updated: May 23, 2025 • 3:10 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పేద ప్రజల సొంతింటి కల నెరవేర్చేందుకు తెలంగాణరాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. దీనిలో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లను అందించనుంది. ఈ పథకం కోసం లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వం వీటిని నిశితంగా పరిశీలించి అర్హులైన వారికి ఇళ్లను మంజూరు చేసే ప్రక్రియ ప్రారంభించింది. ఈ నేపథ్యంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Srinivas Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి అధికారులకు హెచ్చరికలు జారీ చేశారు.ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో అక్రమాలు జరిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్రంలో ఎక్కడైనా అనర్హులకు ఇందిరమ్మ ఇండ్లు కేటాయిస్తే వాటిని మంజూరు చేసిన అధికారులపైనే కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. అవసరమైతే అలాంటి అదికారుల సర్వీసు రద్దు చేస్తామన్నారు. 

వివరాలు

ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుల్లో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వస్తే ముందుగా సదరు అధికారిని సస్పెండ్ చేస్తామని ఆ తర్వాత నిజనిర్దారణ చేసి ఆరోపణలు వాస్తవమని తేలితే అలాంటి అధికారిని సర్వీస్ నుంచి రిమూవ్ చేస్తామని వెల్లడించారు. గురువారం ఖమ్మం కలెక్టరేట్(Khammam Collectorate) లో మీడియాతో మాట్లాడుతూ పొంగులేటి ఈ వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వం భూభారతి, ఇందిరమ్మ ఇండ్లను ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పారు. భూభారతి అమలుపై ప్రత్యేక నిఘా ఉంటుందని వెల్లడించారు.ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుకు సంబంధించి మూడు, నాలుగు దశల్లో క్రాస్ చెక్ చేసిన తర్వాతే అర్హులకు ఇండ్లు కేటాయిస్తున్నామన్నారు. జూన్ 2న రాష్ట్రవ్యాప్తంగా వెయ్యి ఇండ్లలో గృహ ప్రవేశాలు చేసేలా వేగంగా నిర్మాణాలు జరుగుతున్నాయని ఈ సందర్బంగా పొంగులేటి చెప్పుకొచ్చారు. ఇప్పటి వరకు 1.95 లక్షల లబ్ధిదారులను గుర్తించామన్నారు. మిగిలిన వారిని ఈ నెలాఖరు లోపు ఎంపిక చేస్తామని తెలిపారు. అలానే ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులకు అదనంగా 10 వేల ఇండ్లు ఇస్తామన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో 9,800 చెంచు కుటుంబాలు ఉన్నట్లు గుర్తించామని, వాళ్లందరికీ ఇండ్లు ఇస్తామని మరోసారి ఆయన స్పష్టం చేశారు.

Indiramma House:

పథకం

గత ప్రభుత్వం తీసుకు వచ్చిన ధరణి వల్ల రాష్ట్రంలోని ప్రతీ కుటుంబం ఇబ్బంది పడిందని మంత్రి పొంగులేటి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) తీసుకు వచ్చిన భూభారతి పథకం అమలు కింద పైలట్ మండలాలుగా ఎంపిక చేసిన వాటిల్లో వచ్చిన సమస్యల్లో కోర్టులో ఉన్నవాటిని తప్పించి మిగిలిన వాటిని జూన్ 2లోగా పరిష్కరిస్తామని తెలిపారు. అలానే రాష్ట్రంలో 413 గ్రామాలకు ఇప్పటి వరకు నక్షాలు, సర్వే రికార్డులు లేవని, వాటిలో ఐదింటిని పైలట్ గ్రామాలుగా ఎంపిక చేసి సర్వే చేయబోతున్నట్లు చెప్పారు.

Read Also: Telangana: దిగుబడి పెరగడానికి వ్యవసాయ అధికారులు రైతులకు సూచన

#GovernmentAction #HousingSchemeScam #IndirammaHouses #KhammamUpdates #PonguletiSpeech Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.