కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi sanjay) జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని హిందువులు ఏకతాటిపైకి వచ్చి ఓటు బ్యాంకుగా మారాలని ఆయన పిలుపునిచ్చారు. కూకట్పల్లి వద్ద కాపు కులస్తుల కార్తిక వనభోజన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బండి సంజయ్ ప్రసంగంలో హిందువుల ఐక్యతను, ధర్మ పరిరక్షణను ముఖ్యంగా గుర్తుచేశారు.
Read also: Karimnagar Crime: పిల్లలపై కన్నతండ్రి దాడి, కూతురు మృతి
Pawan kalyan
పవన్ కల్యాణ్ సనాతన ధర్మం
అతని వ్యాఖ్యల ప్రకారం, మతం మార్చుకున్న వారు తిరిగి హిందూ ధర్మంలోకి రావాలని కోరారు. హిందూ ధర్మం పరిరక్షణ కోసం ఎల్లప్పుడూ మార్గాలు అందుబాటులో ఉంటాయని భరోసా ఇచ్చారు. పవన్ కల్యాణ్ సనాతన ధర్మంపై చేస్తున్న ప్రచారం వల్ల ఇతర మతాల్లో చేరిన హిందువుల్లో పునరాలోచన మొదలైందని ఆయన పేర్కొన్నారు. హిందూ సనాతన ధర్మంలో గర్వపడేలా, సమాజంలో కులాల సంక్షేమంతోపాటు ధర్మ పరిరక్షణలో కూడ సహకరించాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: