Medaram Jatara: తిరుగుపయనమైన భక్తుల వాహనాలతో ట్రాఫిక్ కష్టాలు

Read Time:  1 min
Medaram Jatara: తిరుగుపయనమైన భక్తుల వాహనాలతో ట్రాఫిక్ కష్టాలు
FONT SIZE
GET APP

తెలంగాణ (TG) మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర (Medaram Jatara) జనసంద్రంగా మారింది. లక్షలాది మంది భక్తులు గద్దెలపై కొలువైన వనదేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. శుక్రవారం నిండు జాతర కావడంతో భక్తుల రద్దీ తారాస్థాయికి చేరింది. అయితే, ప్రభుత్వం కోట్లు ఖర్చు చేసి ఏర్పాట్లు చేసినప్పటికీ, క్షేత్రస్థాయిలో గందరగోళం నెలకొనడంతో భక్తులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా భారీ ట్రాఫిక్ జామ్‌తో నరకయాతన అనుభవిస్తున్నారు.

Read Also: AP: మున్సిపాలిటీల్లో అభివృద్ధిపై మేథోమధనం

Medaram Jatara: తిరుగుపయనమైన భక్తుల వాహనాలతో ట్రాఫిక్ కష్టాలు
Traffic woes due to vehicles of devotees returning home.

నేటితో ముగియనున్న మహా జాతర

(Medaram Jatara) దర్శనం ముగించుకుని తిరుగుపయనమైన భక్తుల వాహనాలతో మేడారం మార్గాలు నిండిపోయాయి. తాడ్వాయి–మేడారం మార్గంలో ఆర్టీసీ బస్సులు, వీఐపీ వాహనాలతో పాటు ప్రైవేట్‌ వాహనాలు భారీగా చేరడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ నిలిచిపోయింది. 14 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి సుమారు 3 గంటల సమయం పట్టిందంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. దీంతో పోలీసులు ప్రైవేట్‌ వాహనాలను పస్రా మీదుగా, ఆర్టీసీ, వీఐపీ వాహనాలను తాడ్వాయి మీదుగా మళ్లించారు.

అమ్మవార్ల గద్దెల వద్ద సరైన ఏర్పాట్లు లేకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. క్యూలైన్ల నిర్వహణ సరిగా లేక వృద్ధులు, చిన్నారులు గందరగోళానికి గురయ్యారు. వీఐపీ పాస్‌లు ఉన్నవారికి సైతం దర్శనం దక్కకపోవడంతో ఆవేదన వ్యక్తమైంది. విపరీత రద్దీ కారణంగా కొందరు భక్తులు దూరం నుంచే దర్శనం చేసుకుని వెనుదిరిగారు. శనివారం అమ్మవార్ల వనప్రవేశంతో మహాజాతర ముగియనుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Saritha

రచయిత గురించి

Saritha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.