పెద్ద శంకరంపేట మెదక్ జిల్లా(Medak) పెద్ద శంకరంపేటలో నేడు నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పాల్గొన్నారు. మండలంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను కలెక్టర్కు విన్నవించుకున్నారు. భూ సంబంధిత సమస్యలు, పింఛన్లు,, తాగునీరు, రహదారులు, విద్యుత్ తదితర అంశాలపై ప్రజలు వినతులు సమర్పించారు. ప్రజల నుంచి అందిన ఫిర్యాదులను పరిశీలించి, సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.
Read Also:TG: అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి
ప్రజల సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని, అధికారులు బాధ్యతాయుతంగా స్పందించాలని కలెక్టర్(Medak) సూచించారు. ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ శ్రీనివాస్ ఎంపీడీవో షాకీర్ అలీ ఎంఈఓ వెంకటేశం పాటు జిల్లా, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: