Mahabubabad: మహబూబాబాద్‌ జిల్లాలో విషాదం..వేధింపులు తట్టుకోలేక వివాహిత ఆత్మహత్య

Read Time:  1 min
Mahabubabad: మహబూబాబాద్‌ జిల్లాలో విషాదం..వేధింపులు తట్టుకోలేక వివాహిత ఆత్మహత్య
FONT SIZE
GET APP

మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం ముల్కనూరులో చోటుచేసుకున్న ఓ విషాద ఘటన స్థానికులను షాక్‌కు గురిచేసింది.ఒకవైపు కట్టుకున్న భర్త అనుమానం, మరోవైపు ప్రేమిస్తున్నానంటూ యువకుడి వేధింపులు. ఓ వివాహిత జీవితాన్ని ఛిద్రం చేశాయి. ఇద్దరి మధ్య నలిగిపోయి, మనోవేదనకు గురై కఠిన నిర్ణయం తీసుకుంది. వారి టార్చర్ తట్టుకోలేకఆత్మహత్య చేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఖమ్మం జిల్లా (Khammam District) తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలుకు చెందిన శైలజకు ఎనిమిదేళ్ల క్రితం మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం ముల్కనూరుకు చెందిన ఏదుల సతీశ్‌కుమార్‌తో వివాహమైంది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొన్నాళ్ల కిందట, శైలజతోపాటు చదువుకున్న ఆర్మీ ఉద్యోగి కె.శ్రీరామ్ పిండిప్రోలులో ఆమెకు తారసపడ్డాడు. అప్పటి నుంచి శ్రీరామ్ ఆమెను ప్రేమిస్తున్నాను అంటూ వేధించడం మొదలుపెట్టాడు. పిల్లలను వదిలి తన వద్దకు రావాలని ఒత్తిడి చేశాడు.

రెండువైపుల నుంచి ఎదురైన ఈ వేధింపులతో

ఈ విషయంపై గతంలో పిండిప్రోలులో పెద్దమనుషుల సమక్షంలో పంచాయతీ నిర్వహించి శ్రీరామ్‌ను హెచ్చరించారు. అయినప్పటికీ అతని ప్రవర్తనలో మార్పు రాలేదు.శ్రీరామ్ వేధింపుల కారణంగా భర్త సతీశ్‌కుమార్ (Sathish Kumar) శైలజపై అనుమానం పెంచుకున్నాడు. శారీరకంగా, మానసికంగా ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. రెండువైపుల నుంచి ఎదురైన ఈ వేధింపులతో శైలజ తీవ్ర మనోవేదనకు గురైంది. జూన్ 26న (బుధవారం) ఆమె ఎలుకల మందు తిని తీవ్ర అస్వస్థతకు గురైంది. తొలుత ఆమెను హైదరాబాద్‌లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో మహబూబాబాద్‌లోని మరో ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి (జూలై 1) ఆమె మరణించింది.

Mahabubabad: మహబూబాబాద్‌ జిల్లాలో విషాదం..వేధింపులు తట్టుకోలేక వివాహిత ఆత్మహత్య
Mahabubabad: మహబూబాబాద్‌ జిల్లాలో విషాదం..వేధింపులు తట్టుకోలేక వివాహిత ఆత్మహత్య

దర్యాప్తు జరుపుతున్నారు

తన కుమార్తె మరణానికి ఆమె భర్త ఏదుల సతీశ్‌కుమార్, పిండిప్రోలుకు చెందిన శ్రీరామ్ కారణమంటూ శైలజ తల్లి బుధవారం గార్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై రియాజ్‌పాషా కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఘటనతో శైలజ (Sailaja) జీవితం అర్థాంతరంగా ముగియగా ఇద్దరు పిల్లలు తల్లిలేనివారయ్యారు. కాగా, శైలజ మృతితో ఆమె తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. తమ కుమార్తె చావుకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Read Also: Rain: తెలంగాణకు రెయిన్ అలర్ట్..పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.