News telugu: Liquor shops- మద్యం దుకాణలకు నేటి నుంచి దరఖాస్తులు

Read Time:  1 min
News telugu
News telugu
FONT SIZE
GET APP

హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త మద్యం దుకాణాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ప్రకారం శుక్రవారం నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. అక్టోబరు 18వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ సారి టెండర్ ఫీజును భారీగా విడతలుగా పెంచారు. గతంలో రూ.2 లక్షల వరకు ఉన్న ఫీజు ఈసారి రూ. లక్ష పెంచుతూ రూ.3 లక్షలుగా ఫిక్స్ చేశారు. అయితే లైసెన్స్ ఫీజును ఆరు చెల్లించేందుకు వెసులుబాటు కల్పించారు.

News telugu
News telugu

మొత్తం 2670 మద్యం దుకాణాలు

మొత్తం 2670 మద్యం దుకాణాలు ఉండగా.. వీటిలో గౌడ్కు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం రిజర్వ్ చేశారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. తెలంగాణ (Telangana)ప్రభుత్వం తాజాగా మద్యం దుకాణాల కేటాయింపుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది.రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా మద్యం దుకాణాలు ఏర్పాటు చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖా స్తుల స్వీకరణ శుక్రవారం (సెప్టెంబరు 26) నుండి అక్టోబర్ 18వ తేదీ వరకు కొనసా గుతుందని నోటిఫికేషన్లో పేర్కొ న్నారు. అనంతరం ఆక్టోబరు విధానంలో లైసెన్స్లు కేటాయించనున్నారు. ఈ అనుమతులు 2025 డిసెంబర్ 1 నుండి 2027 నవంబర్ 30 వరకు అమలులో ఉంటాయి. ప్రభుత్వం ఈసారి టెండర్ ఫీజులో కూడా మార్పులు చేసింది. గతంలో రూ.2 లక్షలుగా ఉన్న ఫీజును రూ.3 లక్షలకు పెంచి నిర్ణయించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న దుకాణాల లైసెన్స్ గడువు నవంబర్ 30తో ముగియనుంది. దాంతో కొత్త దరఖాస్తుల ప్రక్రియ మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ లైసెన్స్ పొందడంలో కొన్ని అర్హత నిబంధనలను కూడా ప్రభుత్వం స్పష్టంగా తెలిపింది. 1968 ఎక్సైజ్ చట్టం (Excise Act)ప్రకారం శిక్షించబడిన వ్యక్తులు అర్హులు కారని నిబంధనలలో పేర్కొంది.

ఎస్సీలకు డ్రా ఎస్టీలకు 5 శాతం రిజర్వేషన్లు

అలాగే సామాజిక న్యాయం దృష్ట్యా రిజర్వేషన్లు కొనసాగుతాయి. రాష్ట్రంలోని 2,620 మద్యం దుకాణాల్లో గౌడ్ కు 1 శాతం, ఎస్సీలకు డ్రా ఎస్టీలకు 5 శాతం రిజర్వేషన్లు అమలులో ఉంటాయి. ఈ కేటాయింపు ద్వారా వెనుకబడిన వర్గాలకు వ్యాపారావకాశాలు లభిస్తాయని అధికారులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మద్యం దుకాణాల లైసెన్సులపై స్పష్టమైన శ్లాబ్ విధానం అమలు చేసింది. మొత్తం ఆరు వర్గాలుగా ఫీజులను విభజించి 2011 జనాభా లెక్కలను ఆధారంగా చేసుకుని నిర్ణయాలు తీసుకుంది. చిన్న గ్రామాల నుండి పెద్ద నగరాల వరకు జనాభా పరంగా వేర్వేరు రేట్లు అమల్లోకి వస్తాయి. జనాభా ఆధారిత లైసెన్స్ ఫీజులు.. 5,000 లోపు జనాభా ఉన్న గ్రామాల్లో వార్షిక ఎక్సైజ్ పన్ను రూ.50 లక్షలు.. 5,000 -50,000 మధ్య జనాభా ఉన్న ప్రదేశాల్లో రూ.55 లక్షలు.. 50,000 1,00,000 జనాభా కలిగిన ప్రాంతాలకు రూ.60 లక్షలు.. 1 లక్ష -5 లక్షల జనాభా గల పట్టణాల్లో రూ.65 లక్షలు.. 5 లక్షల – 20 లక్షల మధ్య జనాభా ఉన్న నగరాల్లో రూ.85 లక్షలు.. 20 లక్షలకు పైగా జనాభా గల మెట్రో నగరాల్లో రూ.1.10 కోటుడా ఉన్నాయి.న్న కుం విధంగా వర్గీకరణ చేయడం ప్రాంతాల్లో వ్యాపారులకు సౌకర్యం కలగగా, పెద్ద పట్టణాల్లో ప్రభుత్వ ఆదాయం మరింత పెరుగుతుందని భావిస్తున్నారు.
లాటరీలో ఎంపికైన వారు వార్షిక లైసెన్స్ ఫీజును ఆరు విడతలుగా చెల్లించాలి. అలాగే.. 25 నెలల లైసెన్స్ కాలానికి గాను మొత్తం ఫీజు 25 శాతం విలువైన బ్యాంక్ గ్యారంటీని సమర్పించడం తప్పనిసరి. దుకాణాల పని వేళలు కూడా వేర్వేరుగా నిర్ణయించారు. జీహెచ్ఎంసీ.. నగర పంచాయతీ పరిధిలో ఉదయం 10 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు, గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఉదయం 10 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు మాత్రమే మద్యం విక్రయానికి అనుమతి ఉంటుంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

Sharanya

రచయిత గురించి

Sharanya

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.