హైదరాబాద్లోని నాగోల్ సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ను సందర్శించిన కేటీఆర్, మూసీ పునరుజ్జీవం పేరుతో ప్రభుత్వం చేస్తున్న కూల్చివేతలను తప్పుబట్టారు. గతంలో బీఆర్ఎస్ హయాంలో ఐదున్నర కిలోమీటర్ల మేర ఎలాంటి నష్టం లేకుండా సుందరీకరణ పనులు చేశామని గుర్తుచేశారు. ప్రజల ఆస్తులను కాపాడుతూనే అభివృద్ధి సాధ్యమని తాము నిరూపించామని ఆయన స్పష్టం చేశారు.
Read also: Hyderabad Drugs: విద్యార్థి వీసాపై వచ్చి స్మగ్లింగ్.. ఇద్దరు విదేశీయులు అరెస్ట్!
16 వేల కోట్లతోనే సుందరీకరణ సాధ్యం
ముఖ్యమంత్రి చెప్తున్నట్లు లక్షన్నర కోట్లు అవసరం లేదని, కేవలం 16 వేల కోట్ల రూపాయలతోనే మూసీని ప్రక్షాళన చేయవచ్చని కేటీఆర్ సవాల్ విసిరారు. ఒకవేళ ఆ బాధ్యత తమకు అప్పగిస్తే ఒక్క పేదవాడి ఇల్లు కూడా కూల్చకుండా ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ధనార్జన కోసమే భారీ బడ్జెట్ అంచనాలను వేస్తోందని ఆయన విమర్శించారు.
హైడ్రా అరాచకాలపై నిప్పులు
నగరంలో హైడ్రా (HYDRA) పేరుతో సామాన్యుల ఇళ్లను కూల్చివేయడం అమానుషమని కేటీఆర్ మండిపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత రెండేళ్లలో కాంగ్రెస్ ఒక్క ఇల్లయినా నిర్మించిందని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఆయన కీలక సవాల్ విసిరారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: