తెలంగాణలో హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఫొటో ఎగ్జిబిషన్ చారిత్రక స్పూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ఆకట్టుకుంటోంది.
గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా ప్రారంభం
ఈ ఫొటో ప్రదర్శనను తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ (Jishnu Dev Varma)లాంఛనంగా ప్రారంభించారు. ఆయన కార్యక్రమంలో పాల్గొని, నాటి పోరాట యోధుల త్యాగాలను చూసి గౌరవించారు. హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్లో విలీనం కావడానికి జరిగిన చారిత్రక సంఘటనలను, ప్రజల ధైర్యసాహసాలను చిత్రరూపంలో చూపిస్తూ ఈ ప్రదర్శన ప్రత్యేకంగా రూపొందించబడింది.

“చరిత్రను యువతకు తెలియజేయాలి” – కిషన్ రెడ్డి
ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి (G. Kishan Reddy)మాట్లాడుతూ, గత అయిదేళ్లుగా కేంద్ర ప్రభుత్వం అధికారికంగా విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తోందని తెలిపారు.
అలానే,
“నిజాం పాలనలో ప్రజలు ఎదుర్కొన్న కష్టాలు, వారి త్యాగాలు – ఇవన్నీ నేటి తరానికి తెలియాలి. ఇది కేవలం ఒక చరిత్ర కాదు, ఒక జాతి గర్వకారణం,” అని ఆయన వ్యాఖ్యానించారు.
అలాగే, ప్రదర్శన ద్వారా ప్రజల్లో దేశభక్తి, చైతన్యం పెంపొందించాలన్నదే లక్ష్యమని చెప్పారు.
సెప్టెంబర్ 17: కేంద్ర స్థాయి వేడుకలకు రంగం సిద్ధం
సెప్టెంబర్ 17న, కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో పరేడ్ గ్రౌండ్స్లో ప్రధాన ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఆయనతో పాటు ఇతర కేంద్ర మంత్రులు, మహారాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు కూడా పాల్గొననున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఏర్పాట్లను సమీక్షించిన బీజేపీ నేతలు
వేడుకల నేపథ్యంలో పరేడ్ గ్రౌండ్స్లో జరుగుతున్న ఏర్పాట్లను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎ. రామచందర్ రావు, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, ఇతర పార్టీ నేతలు స్వయంగా పరిశీలించారు. ఈ కార్యక్రమాల ద్వారా ప్రజల్లో చరిత్రపై అవగాహన, యువతలో దేశభక్తి భావన పెంపొందించాలన్నదే తమ ఆశయమని వారు తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: