📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

KCR: కేసీఆర్ సార్ నేను ప్రజల కోసం పని చేస్తున్నా: సీఎం రేవంత్

Author Icon By Anusha
Updated: May 23, 2025 • 5:11 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోమారు విజ్ఞప్తి చేశారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, తన 40 ఏళ్ల రాజకీయ అనుభవాన్ని తమ ప్రభుత్వానికి అందించి, సలహాలు ఇవ్వాలని కేసీఆర్(KCR) ను కోరారు. “పదవి ఉంటేనే సభకు వస్తామంటే ఎలా? మేము పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నాం. ప్రతిపక్షంలో ఉంటే ప్రజల పక్షాన పోరాడాలి” అని ఆయన హితవు పలికారు. తాను ముఖ్యమంత్రి అయినా ఏనాడూ అహంకారంతో వ్యవహరించలేదని, మీరు అండగా నిలిస్తే అద్భుతాలు చేసి తెలంగాణను ప్రపంచంలోనే గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని ధీమా వ్యక్తం చేశారు.

మహిళలు

తమ ప్రభుత్వం రైతులను అప్పుల బాధ నుంచి విముక్తి చేసిందని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అన్నారు. రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సాయాన్ని రూ.12 వేలకు పెంచి అందిస్తున్నామని, భూమిలేని కౌలు రైతులకు కూడా సహాయం చేస్తున్నామని తెలిపారు. “గతంలో వరి వేసుకుంటే ఉరేనని ఆనాటి ముఖ్యమంత్రి అన్నారు. కానీ, నేడు మేం వరి పంటకు బోనస్ ఇస్తున్నాం” అని గుర్తుచేశారు. 18 నెలల్లో మహాలక్ష్మి పథకం (Mahalaxmi Scheme) కోసం రూ.5,500 కోట్లు కేటాయించామని, కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పునరుద్ఘాటించారు. ఇటీవల జరిగిన మిస్ వరల్డ్ పోటీలకు వచ్చిన ప్రతినిధులు కూడా మన రాష్ట్ర మహిళలు తయారుచేసిన వస్తువులను చూసి అభినందించారని పేర్కొన్నారు. మహిళలే బస్సులు కొనుగోలు చేసి ఆర్టీసీకి కిరాయికి ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని, ఇందిరమ్మ ఆదర్శంగా, సోనియమ్మ స్ఫూర్తితో మహిళలను ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేస్తామని భరోసా ఇచ్చారు.

KCR: కేసీఆర్ సార్ నేను ప్రజల కోసం పని చేస్తున్నా: సీఎం రేవంత్

తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన యువతకు గత పదేళ్ల పాలనలో ఉద్యోగాలు లభించలేదని సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. “తెలంగాణ ఉద్యమంలో నేను ముందున్నానని చెప్పుకున్న వ్యక్తి ఇంట్లో మాత్రం అందరికీ ఉద్యోగాలు వచ్చాయి” అని పరోక్షంగా మాజీ సీఎం కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని, ప్రజలందరూ అండగా ఉంటే ఈ ప్రాంతాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఎన్నిసార్లయినా కలుస్తానని స్పష్టం చేశారు.ఒకాయన అలాగే అలిగి ఫామ్ హౌస్‌లో పడుకున్నారు” అంటూ ఘాటుగా విమర్శించారు. తాను ప్రజల కోసం నిరంతరం కష్టపడతానని తెలిపారు.జహీరాబాద్ ప్రాంత అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. భూములు కోల్పోతున్న నిర్వాసితులకు న్యాయం చేస్తామని, వారికి ఇళ్ల పట్టాలు అందించే బాధ్యతను స్థానిక నేత జగ్గారెడ్డి(Jaggareddy)కి అప్పగిస్తున్నట్లు ప్రకటించారు. “బాధితులకు మంచి భోజనం పెట్టించి జగ్గారెడ్డి పట్టాలు అందిస్తారు” అని తెలిపారు. జహీరాబాద్ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించి నిధులు మంజూరు చేస్తామన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు చేయాలని, ఆ తర్వాత అభివృద్ధి మాత్రమే తమ అజెండా అని స్పష్టం చేశారు. సంజీవ రెడ్డి, సురేష్ షెట్కార్‌లను నారాయణఖేడ్‌కు రెండు కళ్లలాంటి వారని కొనియాడారు.

Read Also : Indiramma House: ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో అక్రమాలు జరిగితే ఉద్యోగాల నుండి తొలగిస్తాం: మంత్రి పొంగులేటి

#OppositionLeader #RevanthReddy #KCR #TelanganaPolitics #TSAssembly Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.