📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

జిల్లాల పర్యటనకు కేసీఆర్ సిద్ధం

Author Icon By Vanipushpa
Updated: February 20, 2025 • 12:45 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మాజీ సీఎం కేసీఆర్ తిరిగి రాజకీయంగా యాక్టివ్ అయ్యేందుకు సిద్దం అవుతున్నారు. పార్టీ ఆవిర్భవించి 25 ఏళ్లు పూర్తవుతున్న వేళ.. తన రాజకీయ ప్రణాళికలతో పాటుగా కాంగ్రెస్ ప్రభుత్వం పై సమరానికి కేసీఆర్ కీలక ప్రకటన చేయనున్నారు. రానున్న రోజుల్లో జిల్లాల పర్యటనకు కేసీఆర్ సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా రెండు భారీ బహిరంగ సభలకు ప్లాన్ చేస్తున్నారు. దీంతో, ఈ రోజు కేసీఆర్ చేసే రాజకీయ ప్రకటన పైన ఆసక్తి నెలకొంది.

రంగంలోకి కేసీఆర్ ఈ రోజు బీఆర్ఎస్ విస్తృత స్థాయి కార్యవర్గం సమావేశం కానుంది. కీలక నిర్ణయాలకు ఈ సమావేశం వేదికగా నిలవనుంది. సుదీర్ఘ విరామం తరువాత కేసీఆర్ పార్టీ కార్యాలయానికి వస్తున్నారు. ఏప్రిల్ 27తో బీఆర్ఎస్ 24 వసంతాలు పూర్తిచేసుకోనుంది. పాతికేళ్లవేళ రజతోత్సవానికి సిద్ధమైంది. ఈ సందర్భంగా పార్టీ భవిష్యత్ కార్యాచరణ ఖరారే ఎజెండాను ఈ సమావేశంలో ఖరారు చేయనుంది. ఇదే సమయంలో పార్టీ సభ్యత్వ నమోదు తో పాటు సంస్థాగత కమిటీలపై కేసీఆర్ స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. పార్టీ సంస్థాగత కమిటీల ఏర్పాటు కోసం నేతలు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏప్రిల్ 27న బీఆర్‌ఎస్ ప్లీనరీ నిర్వహణ పైన నిర్ణయం తీసుకోనున్నారు.

కేసీఆర్ టార్గెట్ రేవంత్ పైనే!

టార్గెట్ రేవంత్ కేసీఆర్ ఫాం హౌస్ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన తరువాత భారీ బహిరంగ సభ నిర్వహించాలని భావిస్తున్నారు. ఇదే సమయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతినిధుల సభ లేదా బహిరంగ సభ నిర్వహణ విషయమై నిర్ణయం ప్రకటించే అవ కాశం ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు అవుతుండటంతో.. ఇక రేవంత్ పాలనా లోపాల పైన నిరసనలకు దిగాలని కేసీఆర్ భావిస్తున్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏడాది సమయం
కార్యాచరణ ఖరారు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏడాది సమయం ఇద్దామని గతంలోనే కేసీఆర్ పార్టీ నేతలకు స్పష్టం చేసారు. ఇప్పుడు ఆ సమయం ముగియటంతో ఇక ప్రతిపక్ష పాత్ర సమర్ధవంతంగా నిర్వహించేలా కొత్త కార్యాచరణ ఖరారు చేయనున్నారు. అందులో భాగంగా ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు కోసం ఒత్తిడి పెంచేలా కేసీఆర్ పొలిటికల్ యాక్షన్ ప్లాన్ ఖరారు చేయనున్నారు. సుదీర్ఘ విరామం అనంతరం పార్టీ నేతలతో విస్తృతంగా సమావేశం అవుతున్న కేసీఆర్ ఎలాంటి మార్గనిర్దేశం చేస్తారన్న ఆసక్తి రాజకీయంగా కొనసాగుతోంది.

#telugu News Ap News in Telugu Breaking News in Telugu brs congress Google News in Telugu KCR Latest News in Telugu Paper Telugu News Revanth Reddy Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.