📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Kavitha: కవిత పార్టీ మారడంపై స్పందించిన కేశవరావు

Author Icon By Anusha
Updated: May 31, 2025 • 10:35 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ పార్టీలో చేరతారనే ఊహాగానాలపై కాంగ్రెస్ సీనియర్ నేత, ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు(K.Kesava Rao) ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆమె చేరిక వల్ల పార్టీకి నిజంగా ప్రయోజనం ఉంటుందని భావిస్తే అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదని అయితే ఆమె వల్ల పార్టీకి పెద్దగా మేలు జరుగుతుందని తాను అనుకోవడం లేదని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ కేకే ఈ వ్యాఖ్యలు చేశారు.కవిత(Kavitha) మాటలను కాంగ్రెస్ పార్టీలో ఎవరూ అంత సీరియస్‌గా తీసుకుంటున్నట్లు తనకు అనిపించడం లేదని ఆయన అన్నారు. తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని, కాంగ్రెస్ పార్టీలోనే తన తుదిశ్వాస విడుస్తానని కేశవరావు తెలిపారు. గతంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్ సుముఖత చూపనందునే తాను పార్టీని వీడి బీఆర్ఎస్‌లో చేరాల్సి వచ్చిందని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు.

Kavitha: కవిత పార్టీ మారడంపై స్పందించిన కేశవరావు

సమాధానం

కేశవరావు ‘ఆపరేషన్ కగారు’ అంశంపై కూడా ఆయన స్పందించారు. శాంతియుత చర్చలకు వస్తామని ఒకవైపు నుంచి ప్రతిపాదన వస్తే, దానిని ఎందుకు స్వాగతించకూడదని ఆయన ప్రశ్నించారు. మావోయిస్టులకు వ్యతిరేకంగా చేపట్టే ఆపరేషన్ల గురించి తాను పార్లమెంటులోనే మాట్లాడానని గుర్తు చేశారు. ‘ఆపరేషన్ సిందూర్’ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) లేవనెత్తిన ప్రశ్నలకు బీజేపీ సమాధానం చెప్పాలని కేకే డిమాండ్ చేశారు. భారత్-పాకిస్థాన్ మధ్య ఆరు యుద్ధాలు జరిగాయని, సైనిక చర్యలకు రాజకీయ ప్రమేయం ఎందుకని ఆయన నిలదీశారు. యుద్ధంలో గెలిచి పాకిస్థాన్‌కు బుద్ధి చెప్పాలనుకుంటున్న తరుణంలో, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వంటి వారి మాటలతో కాల్పుల విరమణ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆయన ప్రశ్నించారు.

Read Also: Rajiv Yuva Vikasam : రాజీవ్ యువ వికాసం తొలి విడతలో ఎంత మందికంటే?

#BRS #CongressParty #KKavitha #PoliticalBuzz #TelanganaPolitics Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Operation Sindoor Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.