News telugu: Jishnu Dev Verma:రైతన్న సేవలకు విద్యార్థులు ముందుండాలి:జిష్ణుదేవ్ వర్మ

Read Time:  1 min
News telugu
News telugu
FONT SIZE
GET APP

హైదరాబాద్ (అత్తాపూర్): దేశంలోని రైతులకు సేవలం దించేందుకు విద్యార్థులు ముందుండాలని క్షేత్రస్థాయిలో రైతలకు అవగాహన కల్పించి తోడ్పాడాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పేర్కొన్నారు. శుక్రవారం పివి నరసింహారావు తెలంగాణ పశువైద్య విశ్వ విద్యాలయం 5వ స్నాతకోత్సవాన్ని వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో గవర్నర్ జిష్ణుదేవ్ అధ్యక్షతన నిర్వహించారు.

News telugu
News telugu

గవర్నర్ మాట్లాడుతూ…

తెలంగాణ బిడ్డ, మాజీ ప్రధాని పి.వి. నర్సింహారావు (P.V. Narasimha Rao)పేరు మీద ఏర్పాటైన ఈ విశ్వవిద్యాలయం ఐదో స్నాతకోత్సవానికి అధ్యక్షత వహించడం నాకు గర్వకారణమని, ఆయన ఆద రాష్ట్రాలు విశ్వవిద్యాల యాన్ని ఎల్లప్పుడు సన్మార్గం. లో నడిపిస్తుంటా యని పేర్కొన్నారు. ముందుగా ఈ అద్భుత మైలురాయిని చేరుకున్నందుకు పట్టభద్రులైన విద్యార్థులందరినీ అభినందించి, ఇది వారి విద్యా ప్రయాణం ముగింపును కాక కొత్త పశువైద్య విభాగం అభివృద్ధి, పశుసంపద సంక్షేమానికి తోడ్పాడాలి పశువైద్య విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో గవర్షర్ జిష్ణుదేవ్ వర్మ ఆరంభానికి నాందిని సూచిస్తుందిని పేర్కొన్నారు. విద్యార్థులు పశువైద్య విభాగం అభివృద్ధికి, పశుసంపద సంక్షేమానికి తోడ్పడాలని వారిని కోరారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన జాతీయ పాడిపరిశ్రమ అభివృద్ధి బోర్డు (NDDB), ఆనంద్, గుజరాత్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ డా. మీనేష్ షా మాట్లా డుతూ.. గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు, డాక్టోరల్ వట్టా గ్రహీతలకు హృదయ పూర్వక అభినందనలు తెలుపుతూ, వారి కృషి, అంకిత భావంతోపాటు కుటుంబ సభ్యులు, అధ్యాపకుల సహకారం కూడా ప్రశంసించారు.

విశ్వవిద్యాలయ ఉపకులపతి డా. జ్ఞానప్రకాష్ మాట్లాడుతూ..

యూనివర్సిటీ సాధించిన విజయాలు, పశువైద్య విద్య, పరిశోధన, విస్తరణ సేవలలో నైపుణ్యాన్ని పెంపొందించడానికి ఉన్న నిబద్ధతను వివరించారు. స్నాతకోత్సవంలో 2023-24లో పట్టభద్రులైన మొత్తం 524 మంది విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేశారు. వీరిలో 16 మంది పీహెచ్.డి. పట్టభద్రులు, 69 మంది మాస్టర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ (ఎంవిఎస్సీ) పట్టభద్రులు, 345 మంది బ్యాచ్ లర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హస్బెండ్రీ (బీవి ఎస్ సీ ఎహెచ్) పట్టభద్రులు, 54 మంది బి. టెక్ (డైరీ టెక్నాలజీ) పట్టభద్రులు, 40 మంది వాచిలర్ ఆఫ్ ఫిషరీ సైన్స్ పట్టభద్రు లు, వివిధ విభాగాలలో విశిష్ట ప్రతిభ కనబరిచిన ప్రతిభావంతులైన విద్యార్థులకు 25 బంగారు పతకాల ప్రధానంతోపాటు అధ్యాపకుల కృషిని గుర్తించి రెండు విశ్వవిద్యాలయ మెరిటోరియస్ టీచర్ అవార్డులు ప్రదానం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/kavitha-bathukamma-2025-celebration-schedule/telangana/551143/

Sharanya

రచయిత గురించి

Sharanya

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.