📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా

రాజలింగమూర్తి హత్యతో నాకు సంబంధం లేదు: గండ్ర వెంకటరమణారెడ్డి

Author Icon By Vanipushpa
Updated: February 20, 2025 • 4:02 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడానికి బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమంటూ కేసు వేసిన రాజలింగమూర్తి నిన్న దారుణ హత్యకు గురికావడం సంచలనం రేపింది. ఈ హత్య వెనుక బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి హస్తం ఉందని మృతుడి కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో గండ్ర మాట్లాడుతూ… రాజలింగమూర్తి హత్యపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

బీఆర్ఎస్ కు అంటగట్టేందుకు యత్నం
రాజలింగమూర్తి హత్యను బీఆర్ఎస్ కు అంటగట్టేందుకు యత్నిస్తున్నారని గండ్ర మండిపడ్డారు. లింగమూర్తిని తానే చంపించానని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు బాధాకరమని అన్నారు. హత్యారాజకీయాలను బీఆర్ఎస్ ఎప్పుడూ ప్రోత్సహించలేదని చెప్పారు. మేడిగడ్డ బ్యారేజీ కేసును చట్టపరంగానే ఎదుర్కొంటామని తెలిపారు. ఈ హత్యతో తనకు కానీ, బీఆర్ఎస్ కు కానీ ఎలాంటి సంబంధం లేదని… హత్యపై సీబీఐతో లేదా సీఐడీతో విచారణ జరిపించి, దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు.


కోమటిరెడ్డి సంచలన ఆరోపణలు
మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై హైకోర్టులో కేసు వేసిన భూపాలపల్లికి చెందిన రాజలింగ మూర్తి (రాజలింగం) దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. గతరాత్రి గుర్తు తెలియని దుండుగలు కత్తులతో పొడిచి, గొడ్డళ్లతో నరికి కిరాతకంగా హత్య చేశారు. తాజాగా రాజలింగం హత్య పొలిటికల్ టర్న్ తీసుకుంది. రామలింగమూర్తి హత్య పైన ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీబీసీఐడీ విచారణకు నిర్ణ యించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసు పైన పోలీసులు విచారణ చేస్తున్నారు. కాగా, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన ఆరోపణలు చేసారు. రాజలింగమూర్తి కేసును ఫాస్ట్రాక్ కోర్టులో విచారణ జరిపిస్తామని చెప్పారు. రాజలింగముర్తిని గండ్ర వెంకట రమణా రెడ్డి హత్య చేయించార ని ఆరోపించారు. ఈ ఘటనవెనక కేసీఆర్, కేటీఆర్, హరీష్ ఉన్నారని సంచలన ఆరోపణలు చేసా రు.

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Gandra Venkataramana Reddy Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Rajalingamurthy's murder Telangana Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.