Goldsmiths : స్వర్ణకారులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి

Read Time:  1 min
Demand for special corporation for goldsmiths in Telangana
Demand for special corporation for goldsmiths in Telangana
FONT SIZE
GET APP

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో చేతివృ త్తులకు మళ్లీ మంచి రోజులు వస్తా యని భావించి తెలంగాణ ఉద్యమం లో ముఖ్యభూమిక పోషించిన విశ్వబ్రా హ్మాణ స్వర్ణకారులకు రాష్ట్రం ఏర్పాటు తర్వాత కూడా అన్యాయం జరగు తుందని తెలంగాణ స్వర్ణకార సంఘం రాష్ట్ర అధ్యక్షులు వింజమూరి రాఘవా చారి, ప్రధాన కార్యదర్శి చేపూరి వెంకటస్వామి, కోశాధికారి గొట్టిముక్కుల చంద్రశేఖర్ అన్నారు. ఈమేరకు బుధవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేరుల సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్ర ఏర్పాటు తర్వాత స్వర్ణకారుల (Goldsmiths) మనుగడను దెబ్బతీసేవిధంగా కార్పొరేట్ తరహా లో నూతనంగా జ్యూవెలరీ షాపులు విరివిగా ఏర్పడుతున్నాయని దీంతో అనాదిగా వస్తున్న కులవృత్తులనే నమ్ముకున్న స్వర్ణకార కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందన్నారు.

షోరూ ముల్లో, రెడీమేడ్ ఆభరణాల అమ్మకాల వల్ల స్వ ర్ణకారులకు చేతినిండా పనిలేకుండా పోయిందన్నారు. కావున ప్రభుత్వం స్వర్ణకార కార్పొరేషన్ ఏర్పాటుచేసి నిధులు కేటాయించి ఆర్థికంగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే దొంగ బంగారం కొన్నారన్న నేపంతో పోలీసు వేధిం పులతో స్వర్ణకారులు ఇబ్బందులకు గురవుతున్నా రని దాన్ని అరికట్టాలన్నారు. అలాగే కార్పొరేట్ జ్యూవెల్లరీ షాపుల్లో పుస్తె మెట్టెలు అమ్మకుండా స్థానిక స్వర్ణకారులు చేసేవిధంగా జీవో అమలు చేయాలన్నారు. అలాగే పెన్షన్ అమలు చేయా లని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో మహిళా అధ్యక్షులు (Women presidents) నారోజు మనోరమ్మ, దుబ్బాక కిషన్ రావు, ఎర్రోజు వేణుచారి, ముటడోజు నాగరాజు, ఇంద్రాల రాజు, అనంతోజు హరిప్రసాద్, సతీష్ చారి, రమేష్చరి, తదితరులు పాల్గొన్నారు.

Read Hindi News : hindi.vaartha.com

Read also : Human Trafficking: మానవ అక్రమ రవాణా నిరోధంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పని చేయాలి : మంత్రి సీతక్క

Shravan

రచయిత గురించి

Shravan

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.