📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

HYD: పేరుకు వంట మనిషి వజ్రాల కె ఎసరు పెట్టిన మోసగాడు

Author Icon By Saritha
Updated: February 7, 2026 • 12:03 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్‌లోని (HYD) జూబ్లీహిల్స్‌లో భారీ చోరీ జరిగింది. నమ్మకంగా వంటమనిషిగా చేరిన ఒక వ్యక్తి, యజమానులు లేని సమయం చూసి తోటి పనివారికి మత్తు మందు ఇచ్చి, కోటి రూపాయలకు పైగా విలువైన వజ్రాభరణాలను (Diamond jewelry) ఊడ్చుకెళ్లాడు. నందగిరి హిల్స్‌లోని వ్యాపారి రవీంద్రశర్మ నివాసంలో ఈ ఘటన వెలుగుచూసింది.

Read Also: Telangana Govt: వాట్సాప్ మీ-సేవ’కు భారీ స్పందన

A cook by profession this con artist tried to swindle people out of diamonds.

మత్తు మందు ఇచ్చి చోరీ

నేపాల్‌కు చెందిన భూపేంద్రషాహీ అలియాస్‌ భువన్‌ అనే వ్యక్తి 15 రోజుల క్రితమే ఓ ఏజెంట్ ద్వారా రవీంద్రశర్మ ఇంట్లో వంటమనిషిగా చేరాడు. (HYD) గురువారం సాయంత్రం కుటుంబ సభ్యులంతా బయటకు వెళ్లిన సమయాన్ని నిందితుడు తనకు అనువుగా మార్చుకున్నాడు. తన పుట్టినరోజు అంటూ వాచ్‌మన్ సహా ఇతర పనిమనుషులకు మత్తుమందు కలిపిన శీతలపానీయం ఇచ్చాడు. వారు స్పృహ కోల్పోగానే మరో ఇద్దరు స్నేహితులను పిలిపించి, రెండో అంతస్తులోని అల్మారాలను ధ్వంసం చేసి వజ్రాలు, బంగారు నగలను దోచుకున్నాడు.

సరిగ్గా చోరీ ముగించుకుని బయటకు వస్తుండగా యజమాని కోడలు ఇంటికి చేరుకుంది. ఆమెను తోసుకుంటూ నిందితులు ముగ్గురూ బైక్‌పై పారిపోయారు. లోపలికి వెళ్లి చూడగా అప్పటికే వాచ్‌మన్ దంపతులు తాళ్లతో బంధించబడి ఉండటం, లాకర్‌లోని నగలు మాయమవడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన జూబ్లీహిల్స్ పోలీసులు నిందితులను చేర్పించిన ఏజెంట్ మదన్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ దోపిడీ వెనుక ప్రొఫెషనల్ నేపాలీ గ్యాంగ్ హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. 

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

diamond jewelry hyderabad Jubilee Hills Latest News in Telugu major theft Nandagiri Hills robbery Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.