हिन्दी | Epaper
గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

తెలంగాణ ప్రభుత్వంతో గూగుల్ ఒప్పందం

Sharanya
తెలంగాణ ప్రభుత్వంతో గూగుల్ ఒప్పందం

ప్రపంచ వ్యాప్తంగా కృత్రిమ మేధ (AI) పెనుమార్పులకు కారణమవుతున్న నేపథ్యంలో, తెలంగాణ ప్రభుత్వం గూగుల్‌తో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా విద్యార్థులు, పరిశ్రమ నిపుణులు, ప్రభుత్వ ఉద్యోగులు కలిపి 1.2 లక్షల మందికి AI శిక్షణ ఇవ్వనున్నారు. టీ హబ్‌లో జరిగిన ఒప్పంద కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి, ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుల సమక్షంలో గూగుల్‌ ఇండియా కంట్రీ మేనేజర్, వైస్‌ ప్రెసిడెంట్‌ ప్రీతి లోబానాతో ఐటీ, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌ రంజన్‌‌లు పాల్గొన్నారు. ప్రధానంగా వ్యవసాయం, సుస్థిరాభివృద్ధి, పరిపాలన, రవాణా, విద్య తదితర కీలక విభాగాల్లో ఏఐ సేవలనే వినియోగించడమే ఈ ఒప్పందం లక్ష్యం.

Chief Minister Sri A Revanth Reddy inaugurated two day Global AI Summit at the HICC Hyderabad 05 09 2024 9

విద్యార్థులకు :
టెక్నాలజీపై అవగాహన, నూతన అవకాశాలు.గూగుల్ ఫర్ ఎడ్యుకేషన్ ద్వారా ఏఐ నైపుణ్యాలు పెంపొందించే కార్యక్రమాలపై దృష్టి సారిస్తుంది. ఎంపిక చేసిన పాఠశాలల్లో డిజిటల్ అభ్యసన పద్దతులను ప్రారంభిస్తుంది. గూగుల్ వర్క్ స్పేస్, క్రోమ్ సర్వీసెస్ ను అందిస్తుంది. గూగుల్ డేటా కామన్స్ ప్లాట్‌ఫామ్ ద్వారా ఓపెన్ డేటా యాక్సెస్‌ను మెరుగుపరుస్తుంది. 500 పాఠశాలల్లో 100 మంది చొప్పున మొత్తం 50 వేల మంది విద్యార్థులకు శిక్షణ ఇప్పించునున్నారు.

వ్యవసాయ రంగం:
పంటలు, గాలి, వర్షపాతం విశ్లేషణకు ఏఐ మద్దతు రవాణా సదుపాయాలను మెరుగుపరిచే డేటా ఇంటిగ్రేషన్ సదుపాయాల కల్పనలోనూ భాగస్వామ్యం పంచుకుంటుంది. రైతులకు అవసరమైన ఇన్పుట్, రెడిట్, మార్కెటింగ్ సదుపాయాలన్నీ అనుసంధానం చేస్తూ తెలంగాణ ఓపెన్ అగ్రికల్చర్ నెట్‌వర్క్ ను ప్రారంభిస్తుంది.

ఆరోగ్య రంగం:
డిజిటల్ హెల్త్‌కేర్ సొల్యూషన్స్ టీ-హబ్‌లో గూగుల్‌ ఒప్పంద కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ, ఏఐ వినియోగంలో తెలంగాణ దార్శనికతకు గూగుల్‌ సహకారం ఎంతగానో ఉపయోగ పడుతుందని అన్నారు. ఏఐ టెక్నాలజీతో కీలక రంగాలలో విప్లవాత్మక మార్పులు తేవాలన్నది తమ లక్ష్యమని చెప్పారు. మెరుగైన పాలన, ఆర్థిక పురోగతితో పాటు ప్రజా సేవలను భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలని భావిస్తున్నామని, ఈ లక్ష్య సాధనలో గూగుల్‌ ఒప్పందం కీలకంగా నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. గూగుల్‌ ఇండియా కంట్రీ మేనేజర్‌ ప్రీతి లోబానా మాట్లాడుతూ, ఏఐ ఆధారిత మానవ వనరులను పెంచడం, స్టార్ట్‌పలను ప్రోత్సహించడం, వ్యవసాయం, విద్య లాంటి కీలక రంగాల్లో పని చేయటం ఉత్సాహంగా ఉందని అన్నారు.

ట్రాఫిక్ సమస్యలకు AI పరిష్కారాలు:

హైదరాబాద్ నగరంలో విస్తృతంగా పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలను ఎదుర్కొనేందుకు, Google సహాయంతో AI ఆధారిత ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ట్రాఫిక్ నియంత్రణ, స్మార్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి, నగరాభివృద్ధి కార్యక్రమాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గించేందుకు హైదరాబాద్ నగరంలోని 7 కీలక కూడళ్లలో ఫ్లైఓవర్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటి ద్వారా రహదారుల విస్తరణ, అనవసర ట్రాఫిక్ ఆలస్యాలు తగ్గే అవకాశముంది. చర్యల ద్వారా హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలకు దీర్ఘకాలిక పరిష్కారం అందించనున్నారు. ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870