కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో రాజకీయంగా, పరిపాలనాపరంగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ మేగా ప్రాజెక్టుకు సంబంధించి గత ప్రభుత్వ హయాంలో జరిగిన చర్యలు, తీసుకున్న నిర్ణయాలు, ఖర్చు చేసిన నిధులపై అనేక ప్రశ్నలు ఎదురవుతున్న నేపథ్యంలో, జ్యుడీషియల్ కమిషన్ విచారణ వేగం పుంజుకుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ హయాంలో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన, ప్రస్తుత బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్(Etela Rajender)ను శుక్రవారం కాళేశ్వరం జ్యుడీషియల్ కమిషన్(Judicial Commission) విచారించింది. విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి సమాచారం నాటి ముఖ్యమంత్రి కేసీఆర్, నాటి నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు వద్దే ఉండేదని, ఆర్థిక శాఖకు ఇందులో పెద్దగా పాత్ర లేదని స్పష్టం చేశారు.
నీటి లభ్యత
విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన ఈటల, తన శాఖ పాత్రపై స్పష్టత ఇచ్చారు.కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో నా పాత్ర ఏమీ లేదు” అని ఈటల రాజేందర్ తేల్చిచెప్పారు. ప్రాజెక్టు రీడిజైనింగ్ కోసం కేసీఆర్ కేబినెట్ సబ్ కమిటీ(KCR Cabinet Sub-Committee)ని ఏర్పాటు చేశారని, దానికి అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు ఛైర్మన్గా వ్యవహరించారని గుర్తుచేశారు. నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకునే మేడిగడ్డ వద్ద ఆనకట్ట నిర్మాణం చేపట్టారని, అయితే ఆనకట్టల నిర్మాణం అనేది పూర్తిగా సాంకేతిక నిపుణులకు సంబంధించిన అంశమని, దానిపై రాజకీయ నాయకులకు అవగాహన ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రతిపాదన చేశారు
మొదట కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.63 వేల కోట్లతో ప్రతిపాదన చేశారు.తర్వాత అనేక కారణాలతో ప్రాజెక్టు వ్యయం రూ.82 వేల కోట్లకు పెరిగింది” అని ఈటల వివరించారు. కమిషన్ తనను ఆర్థికపరమైన అంశాలపై ప్రశ్నలు అడిగిందని, కాళేశ్వరం కార్పొరేషన్ రుణాలపై ఆర్థిక శాఖ ప్రమేయం ఉందా అని ప్రశ్నించిందని తెలిపారు. దీనికి ఆర్థిక శాఖ(Department of Finance)కు ఏమాత్రం సంబంధం లేదని, ఇది పూర్తిగా ఇరిగేషన్ శాఖకు సంబంధించిన విషయమని తాను కమిషన్కు స్పష్టం చేసినట్లు చెప్పారు.