हिन्दी | Epaper
అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

Etela Rajender: ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ముందు ఈటల వాంగ్మూలం

Ramya
Etela Rajender: ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ముందు ఈటల వాంగ్మూలం

తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం: ఈటల రాజేందర్ (Etela Rajender) సంచలన ఆరోపణలు

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసులో భాగంగా మల్కాజ్‌గిరి ఎంపీ, బీజేపీ నేత ఈటల రాజేందర్ (Etela Rajender) నేడు సిట్ ముందు హాజరై తన వాంగ్మూలాన్ని నమోదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఎవరి ఆదేశాల మేరకు ఫోన్లు ట్యాప్ చేశారో స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గతంలో తన ఫోన్‌ను అనేకసార్లు ట్యాప్ చేశారని ఈటల ఆరోపించారు. ముఖ్యంగా, హుజూరాబాద్, గజ్వేల్ ఎన్నికల సమయాల్లో తన ఫోన్‌ను అత్యంత దుర్మార్గమైన పద్ధతిలో ట్యాప్ చేశారని, తమ పార్టీ నాయకుల మధ్య జరిగిన సంభాషణలను సైతం కాల్ డేటాలో పొందుపరిచారని ఆయన వెల్లడించారు. “ధైర్యంగా ఎదుర్కోలేనివారే ఇలాంటి చట్టవ్యతిరేకమైన పనులకు పాల్పడతారు” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థకు గొడ్డలిపెట్టు లాంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రాజకీయ నాయకులే కాకుండా, జడ్జిలు, మంత్రులు, పార్టీల ముఖ్య నేతల ఫోన్లను కూడా ట్యాప్ చేశారని ఈటల తీవ్ర ఆరోపణలు చేశారు.

ప్రభాకర్ రావు నియామకంపై ఈటల ప్రశ్నలు

ప్రభాకర్ రావు నియామకంపై కూడా ఈటల రాజేందర్ పలు ప్రశ్నలు లేవనెత్తారు. ప్రభాకర్ రావు ఐపీఎస్ అధికారి కానప్పటికీ, నిబంధనలకు విరుద్ధంగా ఆయనను ఎస్‌ఐబీ చీఫ్‌గా నియమించారని ఈటల దుయ్యబట్టారు. ఒక విశ్రాంత అధికారిని కీలకమైన పదవిలో అక్రమంగా కొనసాగించారని, మార్గదర్శకాలన్నింటినీ తుంగలో తొక్కారని ఆయన విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో ఇంటెలిజెన్స్ విభాగం మొత్తం నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ కనుసన్నల్లోనే నడిచిందని ఈటల ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై నియమించిన కమిటీ ఇచ్చిన నివేదికను ఇప్పటికీ ప్రభుత్వం బయటపెట్టకపోవడంపై ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు.

విచారణ నివేదికల వెల్లడిలో జాప్యంపై ప్రశ్నలు

ఫోన్ ట్యాపింగ్‌పై విచారణ కమిషన్ వేసి దాదాపు ఏడాదిన్నర కావస్తున్నా, విచారణ నివేదికలను ఎందుకు వెల్లడించడం లేదని ఈటల రాజేందర్ ప్రశ్నించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు లాలూచీ పడకపోతే, ఈ విచారణ నివేదికలను ఎందుకు వెల్లడించడం లేదో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో దోషులు ఎంతటివారైనా కఠినంగా శిక్షించాలని ఈటల రాజేందర్ కోరారు. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో మరింత వేడిని రాజేస్తోంది.

Read also: Mohan Babu: మోహన్‌బాబు రిపోర్టర్‌పై దాడి కేసు.. విచారణ వాయిదా

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

అంగన్‌వాడీల్లో చిన్నారులకు ఇకపై రుచికరమైన బ్రేక్‌ఫాస్ట్!

అంగన్‌వాడీల్లో చిన్నారులకు ఇకపై రుచికరమైన బ్రేక్‌ఫాస్ట్!

రేపు ఖమ్మంకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

రేపు ఖమ్మంకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

ఖమ్మం కూల్చివేతలపై ఎన్హెన్ఆర్సీ దర్యాప్తు?

ఖమ్మం కూల్చివేతలపై ఎన్హెన్ఆర్సీ దర్యాప్తు?

అక్రమ అరెస్టులకు భయపడేది లేదు: పద్మ దేవేందర్ రెడ్డి

అక్రమ అరెస్టులకు భయపడేది లేదు: పద్మ దేవేందర్ రెడ్డి

మార్చి 6 నుంచి ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ – సీఎం రేవంత్

మార్చి 6 నుంచి ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ – సీఎం రేవంత్

కోకాపేట భూములు శారదా పీఠానికే ఇవ్వండి – సీఎం రేవంత్

కోకాపేట భూములు శారదా పీఠానికే ఇవ్వండి – సీఎం రేవంత్

స్కూల్ ఫీజులపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం!

స్కూల్ ఫీజులపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం!

మదీనా బస్సు ప్రమాద బాధితులకు రూ. 5 లక్షల చొప్పున పరిహారం

మదీనా బస్సు ప్రమాద బాధితులకు రూ. 5 లక్షల చొప్పున పరిహారం

సత్తుపల్లి పట్టణంలోని శ్రీ చైతన్య పాఠశాలలో ఘనంగా జాతీయ విజ్ఞాన దినోత్సవ వేడుకలు

సత్తుపల్లి పట్టణంలోని శ్రీ చైతన్య పాఠశాలలో ఘనంగా జాతీయ విజ్ఞాన దినోత్సవ వేడుకలు

కరీంనగర్‌లో కిస్నా మెగా CSR కార్యక్రమం .. సామాజిక బాధ్యతతో పర్యావరణ పరిరక్షణ

కరీంనగర్‌లో కిస్నా మెగా CSR కార్యక్రమం .. సామాజిక బాధ్యతతో పర్యావరణ పరిరక్షణ

లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ హోంగార్డు

లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ హోంగార్డు

రోడ్డు భద్రతపై విద్యార్థులకు ఎస్పీ డి.జానకి దిశానిర్దేశం!

రోడ్డు భద్రతపై విద్యార్థులకు ఎస్పీ డి.జానకి దిశానిర్దేశం!

📢 For Advertisement Booking: 98481 12870