హైదరాబాద్: రాష్ట్రం(Telangana State)లో స్థానిక సంస్థల(Local Elections) ఎన్నికల హడావుడి ప్రారంభం మొదలైంది. గత సంవత్సర కాలంగా పల్లెల్లో సర్పంచులు(Sarpanchh) లేకపోవడంతో ప్రత్యేక అధికారులతో గ్రామాలపరిపాలన కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో ఎప్పుడెప్పుడు పంచాయితీ ఎన్నికలు వస్తాయాని ఆశావాహులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వం(State Govt) మొదట ఎంపిటిసి ఎన్నికలు నిర్వహించాలని భావిస్తోంది. ఈ మేరకు అధికారులకు ప్రభుత్వం సూచనలు కూడా చేసింది. ఎంపిటిసిల ఎన్నికల తర్వాత సర్పంచ్ ఎన్నికల నిర్వహణ ఉండటంతో అధికారులు విధంగా ముందుకు సాగుతున్నారు.

కలెక్టర్లకు ఎన్నికల సంఘం ఆదేశం
ఈ మేరకు ఎన్నికల సంఘం కసరత్తు చేస్తుంది. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన పోలింగ్ సిబ్బంది డేటాను సిద్ధం చేయాలని కలెక్టర్లకు ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో నమోదైన రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్, ప్రిసైడింగ్ అధికారులు, ఇతర మండల, పంచాయితీ లతోపాటు వార్డులసంఖ్య ఆధారంగా పూర్తి వివరాలతో అందుబాటులో ఉండాలని కలెక్టర్లకు ఎన్నికల సంఘం ఆదేశిం సిబ్బంది వివరాలను మరోసారి పరిశీలించాలని ఈ సందర్భంగా ఈసి సూచించినట్లు తెలుస్తోంది. అలాగే రాష్ట్రంలోని జిల్లా, రెవెన్యూ, డివిజన్, ఈ ఆదేశాలతో త్వరలోనే పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలచేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది .
Read hindi news: hindi.vaartha.com