విమాన ప్రయాణంలో తీవ్ర అస్వస్థతకు గురైన ఓ వృద్ధుని ప్రాణాలను మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు, ప్రముఖ వైద్యురాలు డాక్టర్ ప్రీతి రెడ్డి తన సమయస్ఫూర్తి, వైద్య నైపుణ్యంతో ఆమె చేసిన సీపీఆర్ (కార్డియో పల్మనరీ రిససిటేషన్) వృద్ధుడికి పునర్జన్మనిచ్చింది.శనివారం అర్ధరాత్రి సమయంలో ఇండిగో ఎయిర్లైన్స్కు చెందిన ఓ విమానం హైదరాబాద్ నుండి చెన్నై దిశగా ప్రయాణిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
అస్వస్థతకు లోనైన వృద్ధుడు
విమానంలో ప్రయాణిస్తున్న 74 ఏళ్ల వృద్ధుడు అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. ఆయన ఒక్కసారిగా అపస్మారక స్థితిలోకి జారుకోవడంతో పాటు, నోటి నుంచి ద్రవం వెలువడడం ప్రారంభమైంది. ఈ దృశ్యాన్ని చూసిన తోటి ప్రయాణికులు, విమాన సిబ్బంది ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు.దీంతో తోటి ప్రయాణికులు, విమాన సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. అదే విమానంలో ప్రయాణిస్తున్న డాక్టర్ ప్రీతి రెడ్డి, పరిస్థితిని గమనించి వెంటనే స్పందించారు. వృత్తిరీత్యా ఆమె ఓ అనుభవజ్ఞ వైద్యురాలు. ఆ వృద్ధుడిని ప్రాథమికంగా పరీక్షించిన ఆమె, ఆయన రక్తపోటు తీవ్రమైన స్థాయిలో తగ్గిపోవడంతో ప్రమాదకర పరిస్థితిలో ఉన్నారని నిర్ధారించారు.
సీపీఆర్తో జీవం పోసిన సంఘటన
సమయాన్ని కోల్పోకుండా ఆమె తక్షణమే సీపీఆర్ ప్రక్రియను ప్రారంభించారు. కొన్ని నిమిషాల పాటు నిరంతరం ఆమె చేసిన ప్రయత్నాల ఫలితంగా, ఆ వృద్ధుడి శ్వాస తిరిగి సాధారణ స్థితికి వచ్చి, ఆయన శరీరంలో హుషారుగా మారింది. విమాన సిబ్బందితో పాటు ప్రయాణికులు కూడా ఆమె సేవలకు మానసికంగా కృతజ్ఞతలు తెలిపారు. విమానం ల్యాండ్ అయిన వెంటనే, విమానాశ్రయ సిబ్బంది సమయాన్ని వృథా చేయకుండా ఆ వృద్ధుడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వైద్యుల ప్రాథమిక పరీక్షల ప్రకారం, ప్రీతి రెడ్డి స్పందించకపోతే పరిస్థితి మరింత విషమించేదని తెలిపారు.
Read also: Telangana Govt : గిగ్ వర్కర్ల ఉద్యోగ భద్రతపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్