📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

ఉగాది పండుగ కానుకగా సన్నబియ్యం పంపిణీ

Author Icon By Vanipushpa
Updated: February 15, 2025 • 3:52 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో శుభవార్త అందించబోతోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్న ప్రభుత్వము, ఈసారి ఉగాది పండుగ కానుకగా రేషన్ కార్డు ఉన్నవారికి భారీ శుభవార్త అందించనుంది. రాష్ట్రంలో రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ సన్నబియ్యం పంపిణీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి నుంచే ఈ కార్యక్రమానికి సంబంధించి పౌరసరఫరాల శాఖ భారీ ఏర్పాట్లు చేస్తోంది. దీంతో రేషన్ కార్డు ఉన్నవారికి భారీ ఊరట కలగనుంది.

ఈ పథకం అమలులో భాగంగా

4.59 లక్షల మెట్రిక్ టన్నుల సన్నబియ్యం ఇప్పటికే సిద్ధం చేయబడింది. రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి 6 కేజీల చొప్పున బియ్యం పంపిణీ చేయనున్నారు. మొదట సంక్రాంతి పండుగకు ప్రారంభించాలనుకున్న ఈ పథకం కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. ఇప్పుడు ఉగాది సందర్భంగా దీన్ని లాంఛనంగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
కొత్త రేషన్ కార్డుదారులకు వర్తిస్తుందా?
ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డు దారులందరికీ ఈ సన్నబియ్యం అందనుంది. అయితే, కొత్తగా దరఖాస్తు చేసిన వారికి ఈ పథకం వర్తిస్తుందా? లేదా? అన్నది ఇంకా స్పష్టత రాలేదు. జనవరి 26న రిపబ్లిక్ డే రోజున కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభమైంది. కొత్తగా దరఖాస్తు చేసుకున్నవారికి ఈ పథకం వర్తిస్తుందా? అనే అంశంపై ఇంకా స్పష్టత అవసరం. మీ-సేవా కేంద్రాల్లో కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజలు పెద్ద సంఖ్యలో దరఖాస్తులు చేసుకుంటున్నారు.
ప్రజల స్పందన
ఈ కొత్త ప్రకటనపై ప్రజలలో మిశ్రమ స్పందన ఉంది.

పాత రేషన్ కార్డు దారులు ఈ పథకాన్ని స్వాగతిస్తున్నా, కొత్తగా దరఖాస్తు చేసిన వారు తమకు కూడా లబ్ధి ఉంటుందా? అనే ప్రశ్నతో ఎదురు చూస్తున్నారు. ఉగాది కానుకగా సన్నబియ్యం పంపిణీ నిర్ణయం తెలంగాణ ప్రజలకు పండుగ శుభవార్తే. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం నిస్సందేహంగా పేద కుటుంబాలకు ఉపశమనాన్ని అందించనుంది. అయితే, కొత్త రేషన్ కార్డుదారులకు కూడా ఈ సదుపాయం వర్తిస్తుందా? అన్నదానిపై త్వరలోనే ప్రభుత్వం స్పష్టత ఇవ్వవలసిన అవసరం ఉంది.

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Distribution of rice Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news Ugadi festival

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.