हिन्दी | Epaper
కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

చింతల్ బస్తీలో హైడ్రాపై దానం నాగేందర్

Sukanya
చింతల్ బస్తీలో హైడ్రాపై దానం నాగేందర్

బుధవారం మధ్యాహ్నం చింతల్ బస్తీ షాదన్ కళాశాల సమీపంలో అక్రమ నిర్మాణాల కూల్చివేత జరుగుతుండగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అక్కడికి చేరుకొని అధికారులపై గట్టిగా స్పందించారు. ఈ ఘటనతో అక్కడ స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. గతంలో పేదల ఇళ్లను కూల్చకూడదని పేర్కొన్న నాగేందర్, తమకు సమాచారం లేకుండానే కూల్చివేతలు జరగడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “ప్రజా ప్రతినిధిగా నా అనుమతి లేకుండా ఎలా ఈ చర్యలు చేపట్టారు?” అని ప్రశ్నించారు.

చింతల్ బస్తీలో హైడ్రాపై దానం నాగేందర్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన నుండి తిరిగి వచ్చే వరకు కూల్చివేతలను తక్షణం నిలిపివేయాలని, అప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోరాదని హెచ్చరించారు. పేదల ఇళ్లపై దాడులు చేయడం సరికాదని ఆయన నొక్కిచెప్పారు. మురికివాడల్లో పేదల జీవనసామగ్రి కాపాడాలని, హైడ్రాల ద్వారా ప్రజల ఇళ్లను కూల్చివేయడం మానేయాలని అధికారులను ఆయన స్పష్టంగా ఆదేశించారు. తాను అధికారులతో మాట్లాడి, సమస్యను తక్షణమే పరిష్కరించగలనని తెలిపారు.

దానం నాగేందర్ వ్యాఖ్యల తర్వాత అక్కడ గందరగోళ పరిస్థితి నెలకొంది. సైఫాబాద్ మరియు ఖైరతాబాద్ పోలీసు అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. శాంతిభద్రతల ఉల్లంఘన జరగకుండా కూల్చివేత స్థలంలో అదనపు పోలీసు బలగాలను మోహరించారు. ఈ ఘటన స్థానిక ప్రజల్లో కలకలం రేపగా, పేదల ఇళ్ల కూల్చివేతలపై మరింత చర్చకు దారితీసింది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870