📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

వైసీపీ మాజీ ఎమ్మెల్యేపై హైడ్రాకు ఫిర్యాదు

Author Icon By Vanipushpa
Updated: January 20, 2025 • 4:32 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్ పరిధిలోని చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూములను పరిరక్షించటమే లక్ష్యంగా పనిచేస్తున్న హైడ్రాకు నగరవాసుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతున్నాయి. బుద్ధభవన్‌లో ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేసి.. ప్రతి సోమవారం ప్రజావాణి నిర్వహిస్తుండగా.. ఈ కార్యక్రమానికి నగరవాసుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. హైడ్రా ఏర్పాటైన మొదట్లో ప్రజల నుంచి మిశ్రమ స్పందన రాగా.. ప్రస్తుతం హైడ్రా కార్యాలయానికి జనాలు క్యూ కడుతుండటం గమనార్హం. నగరంలో కబ్జాకు గురవుతున్న చెరువులు, కుంటలపై ఆయా ప్రాంతాల ప్రజలే స్వచ్ఛందంగా వచ్చి హైడ్రాకు ఫిర్యాదులు చేస్తుండటం విశేషం. ఈ క్రమంలోనే.. వైసీపీ మాజీ ఎమ్మెల్యేపై కూడా ఫిర్యాదు రావటం గమనార్హం.

వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డిపై హైడ్రాకు ఫిర్యాదు అందింది. సందర్భంగా వైసీపీకి చెందిన ఓ మహిళా నేత.. మాజీ ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డిపై హైడ్రాకు ఫిర్యాదు చేశారు.
హైదరాబాద్‎ అమీన్‌పూర్‎లోని 193 సర్వే నంబర్‎లో ఉన్న తన భూమిని వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డి, రమేష్ అనే వ్యక్తి.. ఇద్దరు కలిసి కబ్జా చేశారని బాధితురాలు హైడ్రా కమిషనర్‎కు కంప్లైంట్ చేశారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని మాజీ ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డి దౌర్జన్యాలు చేశారని.. అందుకు సంబంధించిన అన్ని ఆధారాలు హైడ్రాకు సమర్పించినట్టు ఆమె పేర్కొన్నారు. ఇప్పటికే కబ్జాకు గురైన తమ లేఅవుట్ ప్లాట్లు, రోడ్లు విడుదల అయ్యాయని.. కానీ ఇంకా చాలా ప్లాట్లు నీళ్లలో మునిగే ఉన్నాయని.. నాలాను మూసేసి నీళ్లు వెళ్లకుండా చేయడమే ఇందుకు ప్రధాన కారమణమని ఆమె పేర్కొన్నారు. అయితే.. రాంభూపాల్ రెడ్డికి సంబంధించిన కొన్ని అక్రమ కట్టడాలపై హైడ్రా ఇప్పటికే బుల్డోజర్ ఎక్కుపెట్టింది.

Commissioner Ranganath compliant ex-ycp mla Hydra

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.