📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

హైడ్రా ఫిర్యాదులు స్వీకరించిన కమీషనర్ రంగనాథ్..!

Author Icon By sumalatha chinthakayala
Updated: January 27, 2025 • 8:59 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్‌: ఈరోజు నిర్వహించిన హైడ్రా ప్రజావాణికి 78 ఫిర్యాదులు వచ్చాయి. ఈ మేరకు ఈ మొత్తం ఫిర్యాదులను మీషనర్ రంగనాథ్ స్వయంగా స్వీకరించారు. చెరువులు, నాళాల, ర‌హ‌దారులు, పార్కుల కబ్జాలకు సంబంధించి ఎక్కువ ఫిర్యాదులు వచ్చాయి. అయితే ఈ ఫిర్యాదుల‌ను విచారించి.. సంబంధిత అధికారుల‌కు ఆయా ఫిర్యాదుల‌ను కేటాయించి విచార‌ణ చేప‌ట్టాల‌ని క‌మిష‌న‌ర్ ఆదేశం ఇచ్చారు.

ఒకవేళ నాలుగు వారాల్లో ఫిర్యాదు ప‌రిష్కారం కాకుంటే.. తానే స్వయంగా వ‌చ్చి విచారిస్తాన‌ని ఫిర్యాదుదారులకు కమీషనర్ చెప్పారు. అమీన్‌ పూర్ మండ‌లం ఐలాపూర్ గ్రామం స‌ర్వే నంబ‌రు 119 నుంచి 220 వర‌కూ ఉన్న 408 ఎక‌రాల్లో అక్ర‌మ అమ్మ‌కాలు జ‌రుగుతున్నాయ‌ని ఫిర్యాదు వచ్చింది. అలాగే అబ్దుల్లాపూర్‌ మండ‌లం కుంట్లూర్ చెరువులో 2 ఎక‌రాల స్థ‌లాన్ని క‌బ్జాచేశార‌ని.. వెంట‌నే ఆ భూమిని కాపాడాలంటూ.. ఇంకా నిజాంపేట మున్సిపాలిటీ లో 2900 గ‌జాల పార్కును స్థానికులు క‌బ్జా చేస్తున్నార‌ని కేవీఆర్ రెయిన్‌బో కాల‌నీ ప్ర‌తినిధులు ఫిర్యాదు చేసారు.

కాగా, సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండ‌లం ఐలాపూర్ గ్రామం స‌ర్వే నంబ‌రు 119 నుంచి 220 వర‌కూ ఉన్న 408 ఎక‌రాల్లో అక్ర‌మ అమ్మ‌కాలు జ‌రుగుతున్నాయ‌ని ప‌లువురు ఫిర్యాదు చేశారు. గ‌తంలో 3800 మంది అక్క‌డ గ్రామ‌పంచాయ‌తీ లే ఔట్‌లో ఇంటి స్థ‌లాలు కొని రిజిస్ట‌ర్ చేసుకుంటే.. ఆ భూమి ప్ర‌భుత్వానిది అని తేల్చితే.. తామంతా కోర్టును ఆశ్రయించామ‌ని హైడ్రా క‌మిష‌న‌ర్‌కు వివ‌రించారు. హైకోర్టు స్టే ఆర్డ‌ర్ ఇచ్చిన‌ప్ప‌టికీ అక్క‌డ వారు అన్ని వ్య‌వ‌స్థ‌ల‌ను మేనేజ్‌చేసి ఇంటి స్థ‌లాలుగా అమ్మేస్తున్నార‌ని పేర్కొన్నారు. ఇలా 700ల పైచిలుకు ఇళ్లు నిర్మాణం జ‌రిగాయ‌ని.. ప్ర‌భుత్వ శాఖ‌లు కూడా క‌రెంటు,తాగు నీరు, ర‌హ‌దారుల సౌక‌ర్యం క‌ల్పిస్తున్నాయ‌ని ఫిర్యాదు దారులు పేర్కొన్నారు. హైడ్రా ఈ విష‌యంలో జోక్యం చేసుకోవాల‌ని గ‌తంలో అక్క‌డ ఇంటి స్థ‌లాలు కొన్న‌వారు అభ్య‌ర్థించారు.

78 complaints Ailapur Village Aminpur Mandal Commissioner Ranganath complaints Hydra

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.