బీజేపీపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Read Time:  1 min
revanth
revanth
FONT SIZE
GET APP

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ డాక్టర్ అంబేద్కర్, భారత రాజ్యాంగం, రిజర్వేషన్ వ్యవస్థను అపహాస్యం చేస్తోందని ఆరోపించారు. రాజ్యాంగాన్ని మార్చాలనే బీజేపీ దాగిన అజెండా దేశానికి మంచిది కాదని చెప్పారు. యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) డ్రాఫ్ట్ నిబంధనలను రాజ్యాంగంపై దాడిగా అభివర్ణించారు. ఈ నిబంధనలను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
మధ్యప్రదేశ్‌లోని మౌహ్ పట్టణం, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ జన్మస్థలంలో, కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ‘జై బాపు-జై భీం-జై రాజ్యాంగం’ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. “రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వాళ్లు (బీజేపీ) ఎలాంటి శక్తితో ఆ ప్రయత్నాలు చేస్తే, ఆ శక్తితోనే రాజ్యాంగాన్ని రక్షించడానికి ప్రయత్నిస్తాం. అందుకే మేము ఇక్కడ మౌహ్‌లో సమావేశమయ్యాం” అని రేవంత్ రెడ్డి అన్నారు.

Vanipushpa

రచయిత గురించి

Vanipushpa

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.