CM Cup Telangana : గ్రామీణ యువతకు పెద్ద అవకాశం, సీఎం కప్‌తో ఏం జరగబోతోంది?

Read Time:  1 min
CM Cup Telangana
CM Cup Telangana
FONT SIZE
GET APP

గ్రామీణ యువత క్రీడల్లో రాణించాలి – కలెక్టర్ రాహుల్ రాజ్

ప్రతిభావంతులైన క్రీడాకారులకు నెలవు మెదక్ జిల్లా

CM Cup Telangana : సీఎం కప్ రిజిస్ట్రేషన్ ప్రక్రియపై విస్తృత ప్రచారం చేయాలి కలెక్టర్ రాష్ట్ర ప్రభుత్వం ‌‌ త్వరలో తెలంగాణకు సంబంధించి స్పోర్ట్స్ యూనివర్సిటీ ప్రారంభించే దిశగా ‌ ముందుకు. పండుగ వాతావరణంలో సీఎం కప్ ర్యాలీ మెదక్ పోస్ట్ ఆఫీస్ సర్కిల్ నుండి ధ్యాన్చంద్ చౌరస్తా వరకు నిర్వహణ సి.యం కప్ టార్చ్ ర్యాలీని ప్రారంభించిన కలెక్టర్ రాహుల్ రాజ్ ,అదనపు కలెక్టర్ నగేష్,

గ్రామీణ యువత పల్లె స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయిలో క్రీడల్లో రాణించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు.

మెదక్ జిల్లా కేంద్రంలోని ప్రధాన పోస్ట్ ఆఫీస్ సర్కిల్ నుండి ధ్యాన్చంద్ చౌరస్తా వరకు ముఖ్యమంత్రి కప్ (సి.యం కప్) టార్చ్ ర్యాలీని జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ , జడ్పీ సీఈఓ ఎల్లయ్య, డిపిఓ యాదయ్య,యువజన క్రీడల నిర్వహణ అధికారి రమేష్, డీఎస్పీ ప్రసన్నకుమార్, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు తో కలిసి టార్చిని వెలిగించి జెండా ఊపి ప్రారంభించారు.

సీఎం కప్ ర్యాలీ పటిష్టంగా (CM Cup Telangana) నిర్వహించడానికి జిల్లా పోలీసు యంత్రాంగం ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు తీసుకున్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ మాట్లాడుతూ, సి.యం కప్ టార్చ్ ర్యాలీ ప్రధాన లక్ష్యం గ్రామీణ ప్రాంతాల యువతను క్రీడల వైపు ఆకర్షించి, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభను చాటేలా ప్రోత్సహించడమేనని తెలిపారు.

‌గత సంవత్సరం మాదిరిగానే

ఈ సంవత్సరం కూడా సీఎం కప్ ‌ క్రీడా కార్యక్రమాలు పటిష్టంగా నిర్వహించడానికి చర్యలు చేపట్టామన్నారు . ఆసక్తి గల క్రీడాకారులు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో తెలంగాణకు సంబంధించి స్పోర్ట్స్ యూనివర్సిటీ ప్రారంభించే దిశగా ‌ ముందుకు. పోతుందని గుర్తు చేశారు.

Vijay: ‘జన నాయగన్ ‘ సినిమా విడుదల రోజే అసలైన పండుగ: జై

పల్లెలోని యువత, విద్యార్థులు చదువుతో పాటు క్రీడలపై కూడా ఆసక్తి పెంపొందించుకోవాలని, దీనివల్ల శారీరక దృఢత్వం తో పాటు వ్యక్తిత్వ వికాసం కూడా లభిస్తుందన్నారు. అలాగే తాము ఎంచుకున్న క్రీడల్లో కష్టపడి రాణిస్తే పల్లె స్థాయి నుండి ప్రపంచ స్థాయి ఛాంపియన్లు గా ఎదుగొచ్చని అన్నారు. సి.యం కప్ ద్వారా ప్రభుత్వం యువతకు, విద్యార్థులకు క్రీడా ప్రతిభను ప్రదర్శించుకునే గొప్ప వేదికను కల్పించిందన్నారు.

ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కష్టపడి సాధన చేసి, జిల్లా లోనే కాక జాతీయ, అంతర్జాతీయ వేదికలపై కీర్తి ప్రతిష్ఠలు తీసుకురావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ ర్యాలీలో వివిధ పాఠశాలలు, కళాశాలలకు చెందిన విద్యార్థులు, క్రీడాకారులు, ఎన్.సి.సి క్యాడెట్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ ర్యాలీ పోస్ట్ ఆఫీస్ సర్కిల్ నుండి ధ్యాన్చంద్ చౌరస్తా వరకు వరకు నిర్వహించబడింది.

ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల ప్రిన్సిపల్స్, వ్యాయామఉపాధ్యాయులు,
క్రీడాకారులు క్రీడాభిమానులు, తదితరులు పాల్గొన్నారు .

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Sai Kiran

రచయిత గురించి

Sai Kiran

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.