తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన ఉపరాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో, భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 9న జరగనున్న ఎన్నికల్లో పోలింగ్కు దూరంగా ఉంటామని పార్టీ అధికారికంగా ప్రకటించింది.
రైతుల సమస్యలపై నిరసనగా ఓటింగ్కు దూరం
ఈ నిర్ణయం వెనుక కీలక కారణం—తెలంగాణ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయాలను సమర్థవంతంగా పట్టించుకోకపోవడాన్ని నిరసిస్తూ ఈ మేరకు బీఆర్ఎస్ వైఖరి స్పష్టమైంది. ఈరోజు ఢిల్లీలో మీడియా సమావేశంలో పార్టీ ఎంపీ సురేశ్ రెడ్డి మీడియా సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు.
కేసీఆర్తో చర్చల అనంతరం నిర్ణయం
ఈ నిర్ణయం ఎక్కడిది కాదని, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR)తో జరిగిన విస్తృత చర్చల అనంతరం తీసుకున్న నిర్ణమని సురేశ్ రెడ్డి తెలిపారు. అన్ని కోణాల్లో పరిశీలించిన తర్వాతే ఓటింగ్కు దూరంగా ఉండాలని నిర్ణయించామని పేర్కొన్నారు.
యూరియా కొరత – రైతులకు ప్రధాన సమస్య
ప్రస్తుతం తెలంగాణ రైతులు అనేక ఇబ్బందులతో ఎదుర్కొంటున్నారని, ముఖ్యంగా యూరియా ఎరువుల కొరత తీవ్రంగా ఉండటంతో వారు తీవ్ర సంక్షోభంలోకి వెళ్లారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై ప్రభుత్వాలను పలు మార్లు కోరినా, ప్రత్యుత్తరం లేదని విమర్శించారు.
బ్యాలెట్లో నోటా లేదు, అందుకే బహిష్కారం
ఈ ఎన్నికల్లో నోటా (NOTA) కు అవకాశం లేకపోవడంతో, తమ నిరసనను వ్యక్తీకరించే మార్గంగా పోలింగ్కు దూరంగా ఉండాలని నిర్ణయించామని సురేశ్ రెడ్డి వివరించారు. ఇది అధికార ప్రభుత్వాల వైఫల్యంపై నిరసనగా తీసుకున్న రాజకీయం అని స్పష్టతనిచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు పాల్పడుతోందని సురేశ్ రెడ్డి ఆరోపించారు. ఇది కూడా పార్టీ నిర్ణయంపై ప్రభావం చూపిన అంశంగా చెప్పారు.
అభ్యర్థుల పట్ల గౌరవం ఉన్నా.. రైతులే ప్రాధాన్యం
ఈ ఎన్నికల్లో ఎన్డీఏ తరఫున సీపీ రాధాకృష్ణన్, INDIA కూటమి తరఫున జస్టిస్ బీ. సుదర్శన్ రెడ్డి పోటీలో ఉన్నారు. ఇద్దరు అభ్యర్థుల పట్ల గౌరవం ఉన్నప్పటికీ, తమ పార్టీకి రైతుల సమస్యలే ప్రధానమని సురేశ్ రెడ్డి స్పష్టం చేశారు. సుదర్శన్ రెడ్డి తెలంగాణకు చెందినవారైనా, ప్రజల ప్రయోజనాలే తమకు ముఖ్యమన్నారు.
Read hindi news:hindi.vaartha.com
Read also: