పిల్లలకు ఘన స్వాగతం పలికిన సిబ్బంది,
లంచ్ ఎగబిర్యాని వడ్డించిన నిర్వాహకులు
హైదరాబాద్: వేసవి సెలవుల అనంతరం రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడి కేంద్రాలు బుధవారం తిరిగి ప్రారంభమయ్యాయి. అమ్మ మాట అంగన్వాడి బాట బ్యానర్లతో ర్యాలీలు నిర్వ హించి అంగన్వాడి కేంద్రాల వద్ద చిన్నారులకు అంగన్వాడి టీచర్లు, హెల్పర్లు(Teachers Hlepers) స్వాగతం పలికారు. మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క(Seethakka) ఆదేశాల మేరకు ప్రారంభదినం సందర్భంగా ప్రత్యేకంగా ఎగ్బిర్యాని లంచ్లో వడ్డించారు. తెలంగాణ చరిత్రలో తొలిసారిగా అంగన్వాడి కేంద్రాల్లో వెరైటీ ఫుడ్గా ఎగ్ బిర్యానీ(Egg, Biryani) వడ్డించడం గమనార్హం. ప్రతి రోజు ఒకే రకమైన భోజనం కాకుండా చిన్నారుల అభిరు చులకు అనుగుణంగా ఆహారంలో మార్పులు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.
అంగన్వాడి కేంద్రాలను సందర్శించిన సీతాదయాకర్ రెడ్డి
వీలైన చోట్ల చిన్నారులకు వెరైటీ ఫుడ్ అందిం చేందుకు మహిళా శిశుసంక్షేమ శాఖ చర్యలు తీసుకుంటోంది. ఈ తరహా పోషకాహారం అందించడం ద్వారా అంగన్వాడీ కేంద్రాల్లో అడ్మి షన్లు, హాజరు పెరిగే అవకాశం ఉందని అధికా రులు అంచనా వేస్తున్నారు. టేస్ట్, న్యూట్రిషన్ రెండింటినీ సమపాళ్లలో అందిస్తూ అంగన్వాడీలపై పిల్లలు, తల్లిదండ్రుల్లో నమ్మకం పెరుగుతుందన్న విశ్వాసంతో ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. ఈ సందర్భంగా రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ సీతాదయాకర్ రెడ్డి, సభ్యులు పదుల సంఖ్యలో అంగన్వాడి కేంద్రాలను సంద ర్శించారు. అందిస్తున్న ఆహారం, విద్యా సేవలపై సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం అంగన్వాడీల బలోపేతం కోసం తీసుకుంటున్న చర్యలను స్వయంగా పరిశీలించిన కమిషన్ హర్షం వ్యక్తం చేసింది. హైదరాబాదులోని సైదాబాద్లో గల సింగరేణి కాలనీలో అంగన్వాడి కేంద్రంలో వడ్డించిన ఎగ్ బిర్యానినీ చిన్నారులు ఎంజాయ్ చేశారు.
చిన్నారుల అభిరుచి మేరకు మంత్రి సీతక్క ఆదేశానుసారం మొదటిరోజు ఎగ్ బిర్యానీ వడ్డించినట్లు అంగన్వాడీ టీచర్ అన్నపూర్ణ తెలిపారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో అంగన్వాడి కేంద్రాల బలోపేతం కోసం తమ వంతు కృషి చేస్తామని వెల్లడించారు. అయితే ఉత్తరాది రాష్ట్రాల్లో అంగన్వాడి కేంద్రాల్లో కనీసం కోడిగుడ్లను కూడా ఇవ్వటం లేదు. అలాంటిది తెలంగాణలో ఏకంగా అంగన్వాడీ కేంద్రాల్లో ఎగ్ బిర్యాని వడ్డించడం విశేషం.
Read Also: GHMC : ప్రచారం కోసం జీహెచ్ఎంసీ తాపత్రయం