Ameenpur Government Land Encroachment: అమీన్పూర్ జీహెచ్ఎంసీ సర్కిల్ పరిధిలో అన్యాక్రాంతమవుతున్న అత్యంత విలువైన ప్రభుత్వ భూములను కాపాడాలని మాజీ వైస్ ఎంపీపీ కోకల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. గురువారం ఆయన నేతృత్వంలో మాజీ వార్డు సభ్యులు మరియు గ్రామస్తులు కలిసి తహసీల్దార్ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
Read Also: Harish Rao Inspects Siddipet: దరఖాస్తులు పెండింగ్లో పెట్టొద్దు: హరీష్ రావు
సర్వే నంబర్ల వారీగా ఆక్రమణలు బీరంగూడలోని ప్రసిద్ధ శంభునిగుడి సమీపంలో ఉన్న సర్వే నంబర్ 783లో సుమారు 20 గుంటలు, అలాగే సర్వే నంబర్ 767లో సుమారు 3 గుంటల ప్రభుత్వ భూమి ఉందని గ్రామస్తులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ విలువైన భూములను కొంతమంది వ్యక్తులు అక్రమంగా ఆక్రమించుకుంటున్నారని, ఇప్పటికే అక్కడ ఆక్రమణలు బహిరంగంగా కనిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
Ameenpur Government Land Encroachment: సమగ్ర సర్వేకు విన్నపం
ప్రభుత్వ భూమిని రక్షించకపోతే భవిష్యత్తులో ప్రజా ప్రయోజనాల కోసం లేదా ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాల కోసం స్థలం కొరత ఏర్పడే ప్రమాదం ఉందని వినతిపత్రంలో పేర్కొన్నారు. తక్షణమే సంబంధిత అధికారులతో సదరు సర్వే నంబర్లలో సమగ్ర సర్వే నిర్వహించాలని, భూమికి స్పష్టమైన హద్దులు ఏర్పాటు చేయాలని కోరారు. ఆక్రమణలకు పాల్పడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ వార్డు సభ్యులు సిహెచ్ లింగం గౌడ్, పట్లోళ్ల భాస్కర్ రెడ్డి మరియు అమీన్ పూర్ గ్రామస్తులు పాల్గొన్నారు.
hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: