Aghori : అఘోరికి 14 రోజులు రిమాండ్: కంది జైలుకు తరలింపు
రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలానికి చెందిన ఓ మహిళ ఫిర్యాదు ఆధారంగా అఘోరి అలియాస్ శ్రీనివాసన్ను మోకిల పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలి ఇచ్చిన వివరాల మేరకు మోసం మరియు బెదిరింపులకు సంబంధించి కేసులు నమోదు చేశారు. ఈ కేసులో నిందితుడిని ఉత్తరప్రదేశ్లో అరెస్ట్ చేసి, నార్సింగి పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చారు.అఘోరిని అరెస్ట్ చేసే సమయంలో అతడు పోలీసులపై మానసిక ఒత్తిడిని చూపిస్తూ “నన్ను తాకితే ఆత్మహత్య చేసుకుంటాను” అని బెదిరించినట్టు సమాచారం. అయితే పోలీసులు సున్నితంగా వ్యవహరిచి, అతన్ని విచారణ కోసం హైదరాబాద్కు తరలించారు. నార్సింగిలో ఏసీపీ రమణాగౌడ్ ఆధ్వర్యంలో విచారణ జరిపిన పోలీసులు, వైద్య పరీక్షల అనంతరం అఘోరిని చేవెళ్ల కోర్టులో హాజరుపరిచారు.కోర్టు విచారణలో అఘోరిపై నమోదైన కేసుల ఆధారంగా 14 రోజుల న్యాయ రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. విచారణ సందర్భంగా అఘోరి శ్రీనివాస్ తనకు లాయర్ను నియమించుకునే ఆర్థిక సామర్థ్యం లేదని తెలిపాడు. దీనితో, కోర్టు తన తరఫున వాదించేందుకు న్యాయ సహాయకుడిగా కుమార్ అనే లాయర్ను నియమించింది.అనంతరం పోలీసులు కోర్టు ఆదేశాల మేరకు అఘోరిని కంది జైలుకు తరలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన అఘోరి, “నన్ను చట్టం తీసుకుపోతోంది, కానీ నా భార్య వర్షిణి నాతోనే ఉంది, ఆమె సేఫ్గా ఉంది” అని వెల్లడించాడు. అఘోరి కేసు నేపథ్యాన్ని పరిశీలిస్తే, పోలీసులు మోసం, బెదిరింపు ఆరోపణలపై మరింత లోతుగా దర్యాప్తు జరిపే అవకాశం ఉంది.

నిందితుడిపై మోసం, బెదిరింపు కేసులు నమోదు –కోర్టు 14 రోజుల రిమాండ్ విధింపు
ఇక కంది జైలుకు తరలించబడ్డ అఘోరి భద్రతను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక సెక్యూరిటీతో ఉంచనున్నట్లు అధికారులు తెలిపారు. అతడి మీద ఇప్పటికే ఉన్న కేసులు కాకుండా, ఇతర జిల్లాల్లోనూ అప్పటికే ఒకటి రెండు కేసులు నమోదై ఉండే అవకాశాలు ఉన్నాయని సమాచారం.ఈ కేసు ఆధారంగా ఫేక్ బాబాలు, ఆధ్యాత్మికతను అడ్డుపెట్టుకొని మోసాలు చేసే వ్యక్తులపై సమగ్ర దర్యాప్తు అవసరం ఉందని న్యాయవర్గాలు భావిస్తున్నాయి. ప్రజలలో అవగాహన పెంపొందించేందుకు ప్రభుత్వమే ముందడుగు వేయాలని, మహిళలు తమపై జరిగే దుర్వినియోగాన్ని ఎదుర్కొనడానికి ధైర్యంగా ముందుకు రావాలని పోలీసు ఉన్నతాధికారులు సూచిస్తున్నారు.
Read More : Chaudhry Fawad Hussain : పహల్గామ్ ఉగ్రదాడి..పాకిస్థాన్ మాజీ మంత్రి కీలక వ్యాఖ్యలు