Pahalgam terror attack.. Key comments from former Pakistani minister

Chaudhry Fawad Hussain : పహల్గామ్ ఉగ్రదాడి..పాకిస్థాన్ మాజీ మంత్రి కీలక వ్యాఖ్యలు

Chaudhry Fawad Hussain : పహల్గామ్ ఉగ్రదాడితో భారత్ తీవ్ర ఆవేదనలో ఉంది. కాశ్మీర్ అందాలను చూసేందుకు వెళ్లిన పర్యాటకుల్ని లక్ష్యంగా చేసుకున్న టెర్రరిస్టులు, 28 మంది కిరాతకంగా చంపారు. ఈ దాడి వెనక పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రసంస్థ లష్కరే తోయిబాకు చెందిన ‘‘టీఆర్ఎఫ్’’ ఉన్నట్లు తేలింది. మరోవైపు, పాకిస్తాన్ తమకు ఈ దాడితో సంబంధం లేదని చెబుతూనే, సరిహద్దుల్లో తన బలగాలను మోహరించింది. భారత్ మళ్లీ సర్జికల్ స్ట్రైక్స్ చేస్తుందనే భయంతో ఉంది.

Advertisements
 పహల్గామ్ ఉగ్రదాడి పాకిస్థాన్ మాజీ

దేశం కోసం ఒక్కటిగా నిలబడుతాం

ఇదిలా ఉంటే, పాకిస్తాన్ మాజీ మంత్రి చౌదరి ఫవాద్ హుస్సేన్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశం “దాడి చేసినా లేదా బెదిరించినా” దేశం తనను తాను రక్షించుకోవడానికి కలిసి నిలబడుతుందని అన్నారు. తాము రాజకీయం విభజించబడి ఉన్నప్పటికీ, దేశం కోసం ఒక్కటిగా నిలబడుతామని అన్నారు. తమ మాతృభూమిని రక్షించుకోవడానికి పాకిస్తాన్ జెండా కింద కలిసి ఉంటామని ఎక్స్ వేదికగా ఫవాద్ పోస్ట్ చేశాడు. అయితే, ఈ పోస్టులో పహల్గామ్ దాడి గురించి ఎలాంటి సంతాపం కానీ, ఖండన కానీ, ప్రస్తావన కానీ చేయలేదు.

లక్షలాది మంది ప్రాణాలను పణంగా పెద్దవద్దు

ఉగ్రదాడి తర్వాత భారతదేశంలో నిరంతర పరిణామాలను పర్యవేక్షిస్తున్న ఫవాద్.. మోడీ ప్రభుత్వం నుంచి సంయమనం ఆశిస్తున్నట్లు మరో పోస్ట్‌లో పేర్కొన్నాడు. “భారత మంత్రివర్గం తన భద్రతా సమావేశాన్ని ముగించింది. యుద్ధానికి ఆజ్యం పోసేలా మీడియా కథనాలకు లొంగి లక్షలాది మంది ప్రాణాలను పణంగా పెద్దవద్దని ఆశిద్దాం’’ అంటూ ట్వీట్ చేశారు.

పుల్వామా తర్వాత జరిగిన అత్యంత దారుణమైన దాడి

జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన ఉగ్రవాద దాడి, 2019లో పుల్వామా తర్వాత జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన అత్యంత దారుణమైన దాడిలో ఇది ఒకటి. మంగళవారం మధ్యాహ్నం అనంతనాగ్ జిల్లాలోని పహల్గామ్ పట్టణానికి సమీపంలోని ఒక గడ్డి మైదానం సమీపంలో జరిగింది. లష్కరే తోయిబా ప్రతినిధి సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF) బాధ్యత వహించింది. దాడి వెనుక ఉన్న ముగ్గురు అనుమానితుల స్కెచ్‌లను భారత భద్రతా సంస్థలు విడుదల చేశాయి. వీరిని పాకిస్తాన్ జాతీయులైన ఆసిఫ్ ఫౌజీ, సులేమాన్ షా మరియు అబు తల్హాగా గుర్తించారు.

Read Also: ఉగ్రదాడి.. ముగ్గురు టెర్రరిస్టుల స్కెచ్‌లు విడుదల

Related Posts
కైట్ ఫెస్టివల్: హైదరాబాద్ ట్రాఫిక్ సలహాలు
కైట్ ఫెస్టివల్ హైదరాబాద్ ట్రాఫిక్ సలహాలు

2025 జనవరి 13 నుండి 2025 జనవరి 15 వరకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో జరగనున్న ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ 2025 దృష్ట్యా హైదరాబాద్ Read more

ఢిల్లీ కొత్త సీఎం రేఖా గుప్తా సహా ఐదుగురిపై క్రిమినల్ కేసులు
రేఖా గుప్తా

న్యూఢిల్లీ: ఢిల్లీలో ముఖ్యమంత్రి రేఖా గుప్తా సహా కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన ఏడుగురు మంత్రుల్లో ఐదుగురిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. 2025 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు Read more

ఇండియా టుడే సర్వేలో సీఎం చంద్రబాబుకు 4వ స్థానం
TTD and railway services on WhatsApp.. CM Chandrababu

రాష్ట్ర ప్రజలకు గర్వకారణం జాతీయ స్థాయిలో అత్యుత్తమ ముఖ్యమంత్రుల జాబితాలో ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు నాలుగో స్థానాన్ని దక్కించుకున్నారు. ప్రముఖ మీడియా సంస్థ ఇండియా Read more

ఫెయిల్ అయితే పున:పరీక్షలు
ఫెయిల్ అయితే పున:పరీక్షలు

5, 8 తరగతుల విద్యార్థులకు 'నో డిటెన్షన్ విధానం' రద్దు: కేంద్రం విద్యార్థుల అభ్యసన మౌలికతను పెంపొందించడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×