📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Maoists : వరంగల్‌లో 14 మంది మావోయిస్టుల లొంగుబాటు

Author Icon By sumalatha chinthakayala
Updated: April 24, 2025 • 2:43 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Maoists : వరంగల్‌లో 14 మంది మావోయిస్టులు లొంగిపోయారు. పోలీసుల ఎదుట లొంగిపోయిన వారిని ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి మీడియా ముందుకు తీసుకొచ్చారు. అనంతరం ఐజీ మాట్లాడుతూ.. ఒక్కో మావోయిస్టుకు రూ.25వేల ఆర్థిక సహాయం అందించాం. మావోయిస్టులు హింసాయుత విధానాలు వదిలివేసేలా చేయడమే మా ఉద్దేశం. ఏ రాష్ట్రానికి చెందిన మావోయిస్టులు వచ్చి లొంగిపోయినా సహకారం అందిస్తాం. జనజీవన స్రవంతిలో కలిస్తే ఉపాధి అవకాశాలు కల్పిస్తాం అని చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు.

వారిలో 28 ఏళ్ల లోపు వారే ఎక్కువ

ఈ ఏడాది 250 మంది సరెండర్‌ అయ్యారు. నేడు 14 మంది లొంగిపోయారు. వీరిలో ఇద్దరు ఏరియా కమిటీ సభ్యులు ఉన్నారు. రెండు నెలలుగా మావోయిస్టుల లొంగుబాట్లను ప్రోత్సహిస్తున్నాం అని చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. సరెండర్ అయిన వారిలో 28 ఏళ్ల లోపు వారే ఎక్కువగా ఉన్నారని చెప్పారు. కర్రెగుట్టలో కూంబింగ్‎ ఆపరేషన్‎తో మాకు ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు. ఛత్తీస్‎గఢ్ భద్రతా దళాలు ఆ ఆపరేషన్ చేపట్టాయని స్పష్టం చేశారు.

ప్రభుత్వ పునరావాస పథకాలు

ఈ 14 మంది లొంగిపోయిన వారిలో మహిళా మావోయిస్టులు కూడా ఉన్నారు. వారు తమ గత జీవితాన్ని వీడి, శాంతియుత జీవితం ప్రారంభించాలనుకుంటున్నట్లు తెలిపారు. పోలీసుల ప్రకారం, లొంగిపోయిన వారిపై వివిధ ప్రాంతాల్లో అనేక కేసులు నమోదయ్యాయి. అయితే, వారు స్వచ్ఛందంగా లొంగిపోవడం, ప్రభుత్వ పునరావాస పథకాలను స్వీకరించడం ద్వారా కొత్త జీవితం ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు.​

Read Also: హైదరాబాద్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి, బృందం

14 Maoists Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Surrender Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today warangal

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.