CM Revanth Reddy : ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఏడు రోజుల జపాన్ పర్యటన ముగించుకుని బుధవారం రాత్రి హైదరాబాద్కు చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలోని బృందానికి పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ సలహాదారులు, కార్పొరేషన్ ఛైర్మన్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. ఏప్రిల్ 16 న సీఎం నేతృత్వంలో అధికారులు బృందం ప జపాన్ పర్యటనకు వెళ్లింది. ఏడు రోజుల పాటు జపాన్ లో పర్యటించిన అధికారుల వివిధ పరిశ్రమల యాజమాన్యాలతో సంప్రదింపులు జరిపి తెలంగాణలో రూ. 12వేల 62 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు.

కీలక ఒప్పంద వివరాలు..
.హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేసేందుకు మారుబెని కంపెనీతో అగ్రిమెంట్ చేసుకున్నారు. ఈ ఒప్పందంలో మొత్తం అంచనా పెట్టుబడి రూ. 5 వేల కోట్లుకాగా.. తొలుత వెయ్యి కోట్లతో ప్రారంభపెట్టుబడి పెట్టేందుకు ఒప్పందం చేసుకున్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా తెలంగాణ యువతకు 30 వేల ఉద్యోగాలు రానున్నాయి.
.జపాన్లో 500 ఉద్యోగ నియామకాలకు టామ్ కామ్… టెర్న్.. రాజ్ గ్రూప్ సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం.. తెలంగాణ యువతకు ఉద్యోగాలు ఇచ్చేందుకు ఆ సంస్థ అంగీకారం తెలిపింది.
.రుద్రారంలో రూ. 562 కోట్లతో ఎలక్ట్రికల్ పరికరాలు తయారీ ఫ్యాక్టరీని నెలకొల్పేందుకు తోషిబా ట్రాన్స్ మిషన్ & డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ ఇండియా (TTDI) తో జపాన్ పర్యటనలో సీఎం రేవంత్రెడ్డి బృందం ఒప్పందం చేసుకుంది.
.రూ. 10 వేల 500 కోట్ల పెట్టుబడితో హైదరాబాద్ లో ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటు చేసేందుకు NTT డేటా, నెయిసా కంపెనీలతో అంగీకారం కుదుర్చుకుంది.
Read Also: సింగరేణి.. వారికి 50% జీతంతో స్పెషల్ లీవ్స్