CM Revanth Reddy and team arrive in Hyderabad

CM Revanth Reddy :హైదరాబాద్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి, బృందం

CM Revanth Reddy : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఏడు రోజుల జపాన్‌ పర్యటన ముగించుకుని బుధవారం రాత్రి హైదరాబాద్‌కు చేరుకున్నారు. శంషాబాద్‌ విమానాశ్రయంలో సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని బృందానికి పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ సలహాదారులు, కార్పొరేషన్‌ ఛైర్మన్లు, కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. ఏప్రిల్​ 16 న సీఎం నేతృత్వంలో అధికారులు బృందం ప జపాన్​ పర్యటనకు వెళ్లింది. ఏడు రోజుల పాటు జపాన్​ లో పర్యటించిన అధికారుల వివిధ పరిశ్రమల యాజమాన్యాలతో సంప్రదింపులు జరిపి తెలంగాణలో రూ. 12వేల 62 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు.

Advertisements
హైదరాబాద్ చేరుకున్న సీఎం రేవంత్

కీలక ఒప్పంద వివరాలు..

.హైదరాబాద్​ ఫ్యూచర్​ సిటీలో నెక్స్ట్​ జనరేషన్​ ఇండస్ట్రియల్​ పార్క్​ ఏర్పాటు చేసేందుకు మారుబెని కంపెనీతో అగ్రిమెంట్​ చేసుకున్నారు. ఈ ఒప్పందంలో మొత్తం అంచనా పెట్టుబడి రూ. 5 వేల కోట్లుకాగా.. తొలుత వెయ్యి కోట్లతో ప్రారంభపెట్టుబడి పెట్టేందుకు ఒప్పందం చేసుకున్నారు. ఈ ప్రాజెక్ట్​ ద్వారా తెలంగాణ యువతకు 30 వేల ఉద్యోగాలు రానున్నాయి.
.జపాన్​లో 500 ఉద్యోగ నియామకాలకు టామ్​ కామ్​… టెర్న్​.. రాజ్​ గ్రూప్​ సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం.. తెలంగాణ యువతకు ఉద్యోగాలు ఇచ్చేందుకు ఆ సంస్థ అంగీకారం తెలిపింది.
.రుద్రారంలో రూ. 562 కోట్లతో ఎలక్ట్రికల్​ పరికరాలు తయారీ ఫ్యాక్టరీని నెలకొల్పేందుకు తోషిబా ట్రాన్స్ మిషన్ & డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ ఇండియా (TTDI) తో జపాన్​ పర్యటనలో సీఎం రేవంత్​రెడ్డి బృందం ఒప్పందం చేసుకుంది.
.రూ. 10 వేల 500 కోట్ల పెట్టుబడితో హైదరాబాద్​ లో ఇంటెలిజెన్స్​ డేటా సెంటర్​ క్లస్టర్​ ఏర్పాటు చేసేందుకు NTT డేటా, నెయిసా కంపెనీలతో అంగీకారం కుదుర్చుకుంది.

Read Also: సింగరేణి.. వారికి 50% జీతంతో స్పెషల్ లీవ్స్

Related Posts
కనుమ.. ప్రత్యేకతలు ఏంటి..? రథం ముగ్గు.. ఎందుకు ?
kanuma ratham muggu

సంక్రాంతి పండుగలో మూడో రోజు కనుమకు ప్రత్యేక స్థానం ఉంది. కనుమను ప్రధానంగా పశువులకు అంకితం చేస్తారు. రైతుల తోడుగా ఉంటూ ఏడాది పొడవునా శ్రమించే పశువులను Read more

ఆయుష్మాన్ భారత్‌ ద్వారా క్యాన్సర్ చికిత్స
నేడు ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం: ఆయుష్మాన్ భారత్‌ ద్వారా క్యాన్సర్ చికిత్స

ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 4న ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం (World Cancer Day) జరుపుకుంటారు. ఈ రోజును యూనియన్ ఫర్ ఇంటర్నేషనల్ క్యాన్సర్ కంట్రోల్ (UICC) ప్రారంభించింది. Read more

ఎస్సీ వర్గీకరణకు బీఆర్ఎస్ మద్దతు
sc reservation

తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ అంశంపై చర్చ కొనసాగుతున్న సమయంలో, బీఆర్ఎస్ పార్టీ తన సపోర్ట్ క్లియర్‌గా ప్రకటించింది. అసెంబ్లీలో ఈ అంశంపై మాట్లాడిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ Read more

సనాతన ధర్మం.. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన ఉదయనిధి స్టాలిన్
Udhayanidhi Stalin reacts to Pawan Kalyan comments on Sanatana Dharma

Udhayanidhi Stalin reacts to Pawan Kalyan comments on Sanatana Dharma చెన్నై: జనసేన అధినేత, ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సనాతన ధర్మాన్ని ఎవరూ Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×