బీఆర్ఎస్‌లో చేరిన మ‌హేశ్ రెడ్డి

Read Time:  1 min
mahesh brs
mahesh brs
FONT SIZE
GET APP

తెలంగాణలోని నిర్మల్ జిల్లాలో బీజేపీకి షాక్ తగిలింది. నిర్మల్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన బీజేపీ సీనియర్ నేత పీవీ మహేశ్ రెడ్డి ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి… బీఆర్ఎస్‌లో చేరారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో ఆయన గులాబీ కండువాను కప్పుకున్నారు.

కేటీఆర్ ఆయనకు పార్టీ కండువాను కప్పి స్వాగతించారు. ఈ సందర్భంగా మహేశ్ రెడ్డి మాట్లాడుతూ… నిర్మ‌ల్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ బ‌లోపేతానికి కృషి చేస్తాన‌న్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రామకృష్ణారెడ్డి తదితరులు ఉన్నారు. ఎన్నికలో ఓడిపోయిన బీఆర్ఎస్ పార్టీ పలువురు నేతలు కాంగ్రెస్ లో చేరుతున్నారు. కాని అనూహ్యంగా బీజేపీ నాయ‌కులు బీఆర్ఎస్ పార్టీలో చేరడం హాట్ టాపిక్ గా మారింది.

Vanipushpa

రచయిత గురించి

Vanipushpa

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.