దేవుడి ముందు అందరూ సమానమే: శ్రీనివాస్‌గౌడ్‌

Read Time:  1 min
srinivas goud
srinivas goud
FONT SIZE
GET APP

తిరుమలకు వెళ్లే వారిలో తెలంగాణ భక్తులే అధికమని, రాజకీయ నేతలందరినీ ఒకేలా చూడాలని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. గతంలో టీటీడీ కల్పించిన సౌకర్యాలను పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. తిరుమల పుణ్యక్షేత్రంలో భక్తులు, రాజకీయ నేతలందరినీ ఒకేలా చూడాలని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. దేవుడి ముందు అందరూ సమానమేని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను టీటీడీ స్వీకరించకపోవడం బాధాకరమని అన్నారు.
జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని జములమ్మను కుటుంబ సమేతంగా దర్శించుకొన్నారు. అనంతరం బీఆర్‌ఎస్‌ నేత బాసు హన్మంతు నాయుడి నివాసంలో మీడియాతో మాట్లాడారు. తిరుమలలో గతంలో ఉన్న సంప్రదాయాలను కొనసాగించడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. తిరుమలలో ప్రస్తుతం తెలంగాణ వాసులపై వివక్ష చూపుతున్నారని ధ్వజమెత్తారు.

ఏపీ సీఎం చంద్రబాబు, టీటీడీ చైర్మన్‌ స్పందించి సిఫారసు లేఖలు స్వీకరించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. జోగుళాంబ దేవికి దసరా ఉత్సవాల సమయంలో కర్నూల్‌ కలెక్టర్‌ పట్టువస్ర్తాలు సమర్పించేవారని.. తిరుమల ఉత్సవాల సమయంలో గద్వాల పట్టుపంచెలు స్వామికి సమర్పించడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు.

Vanipushpa

రచయిత గురించి

Vanipushpa

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.