ఎస్ఐ, కానిస్టేబుల్ ఆత్మహత్య కేసులో సంచలన విషయాలు

Read Time:  1 min
si and constable death
si and constable death
FONT SIZE
GET APP

తెలంగాణలో సంచలనం సృష్టించిన ట్రిపుల్ డెత్ కేసులో చిక్కుముడులు వీడనున్నాయి. భిక్కనూర్ ఎస్ఐ సాయి కుమార్, బీబీపేట మహిళా కానిస్టేబుల్ శృతి, కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ ముగ్గురూ అడ్లూర్ ఎల్లారెడ్డి చెరువులో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. మృతుల కుటుంబ సభ్యులను, వారితో పనిచేసిన సిబ్బందిని ప్రశ్నించి వివరాలు రాబడుతున్నారు. ముగ్గురి ఫోన్లను తెరిచేందుకు విఫలయత్నం చేశారు. అయితే మృతుల బ్యాంక్ ఖాతాలు, లాకర్లను తెరిస్తే ఏదైనా క్లూ దొరకవచ్చని భావిస్తున్నారు. ఇందుకోసం ఉన్నతాధికారుల అనుమతి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
వివాహేతర సంబంధమే కారణమా?

బీబీపేట ఎస్ఐగా వచ్చిన సాయి కుమార్ మంచి వ్యక్తి అని, అందరితో కలుపుగోలుగా ఉంటారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. విధినిర్వహణలో కానిస్టేబుల్ శృతితో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసిందని అన్నారు. ఎస్ఐ సాయి కుమార్ తో బంధం కన్నా ముందే శృతి కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ తో ప్రేమ వ్యవహారం నడిపిందని సమాచారం.

నిలదీసిన ఎస్ఐ సాయి కుమార్ తో వివాదం?

ఈ విషయం ఎస్ఐకి తెలిస్తే తనకు ప్రమాదమని భావించిన శృతి.. నిఖిల్ ను ఎస్ఐ సాయి కుమార్ కు దగ్గర చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సాయి కుమార్ కు భిక్కనూరుకు బదిలీ కావడంతో శృతితో గ్యాప్ పెరిగిందన్నారు. ఆ తర్వాత శృతి, నిఖిల్ ల ప్రేమ వ్యవహారం తెలియడంతో సాయి కుమార్ ఇద్దరినీ నిలదీశారని, ఈ విషయంపై మాట్లాడుకోవడానికే ముగ్గురూ అడ్లూర్ ఎల్లారెడ్డి చెరువు దగ్గర కలిశారని అధికారులు భావిస్తున్నారు.

మాటామాటా పెరగడంతో బెదిరించేందుకు శృతి ముందుగా చెరువులో దూకి ఉండవచ్చని, ఆ తర్వాత నిఖిల్ కూడా దూకడంతో ఆందోళనకు గురైన ఎస్ఐ సాయి కుమార్ కూడా ఆత్మహత్య చేసుకుని ఉంటాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు వెలుగులోకి రానున్నాయి అని పోలీసులు చెబుతున్నారు.

Vanipushpa

రచయిత గురించి

Vanipushpa

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.