Ration Card: రేషన్ కార్డులు కలిగిన లబ్దిదారులకు మరింత సౌకర్యం కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. రేషన్ పంపిణీలో పారదర్శకత పెంచి అక్రమాలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా కొత్త సాంకేతిక విధానాలను అమలు చేయనుంది. త్వరలో డిజిటల్ వాలెట్ ద్వారా చెల్లింపులు చేసే అవకాశం, అలాగే ఏటీఎం తరహా యంత్రాల ద్వారా రేషన్ సరఫరా చేసే విధానాన్ని దేశవ్యాప్తంగా విస్తరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది.
Read Also: SBI InsuranceScheme: ₹3,000 ప్రీమియంతో ₹60 లక్షల ప్రమాద బీమా

ఈ-రూపీ ద్వారా డిజిటల్ చెల్లింపులు
రేషన్ షాపుల్లో చెల్లింపుల కోసం లబ్దిదారులకు డిజిటల్ వాలెట్లు అందిస్తారు. వీటిలో ఆర్బీఐ జారీ చేసే ఈ-రూపీ జమ అవుతుంది. క్యూఆర్ కోడ్ లేదా ఆధార్ ఓటీపీ ద్వారా చెల్లింపులు చేయవచ్చు. ఈ విధానం ద్వారా డబ్బు నేరుగా డీలర్ ఖాతాలో జమ కావడంతో మధ్యవర్తుల పాత్ర తగ్గుతుంది. అలాగే ఎవరికెంత రేషన్ అందిందనే సమాచారం రియల్ టైంలో ప్రభుత్వానికి అందుతుంది.
అన్నపూర్తి గ్రేన్ ఏటీఎంల ద్వారా రేషన్ సరఫరా
ఏటీఎం తరహా “అన్నపూర్తి” యంత్రాల ద్వారా లబ్దిదారులు 24 గంటలు రేషన్ తీసుకునే అవకాశం కల్పించనున్నారు. డిజిటల్ కార్డు స్కాన్ చేసి, వేలిముద్ర లేదా ఐరిస్ ధృవీకరణ అనంతరం బియ్యం పొందవచ్చు. ఈ యంత్రాల ద్వారా 35 సెకన్లలోనే 25 కిలోల ధాన్యం అందించే సామర్థ్యం ఉంటుంది. మార్చి 2026 నుంచి గోధుమలు, పప్పులు, చక్కెర, ఉప్పు వంటి సరుకులను కూడా పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
దేశవ్యాప్తంగా విస్తరణకు ప్రణాళిక
ప్రస్తుతం కొన్ని రాష్ట్రాల్లో పైలట్ ప్రాజెక్ట్గా అమలు చేస్తున్న ఈ విధానాన్ని భవిష్యత్తులో దేశమంతటా విస్తరించనున్నారు. దీని ద్వారా రేషన్ సరఫరా ప్రక్రియ వేగవంతమై, ప్రజలకు మరింత సౌలభ్యం కలుగుతుందని అధికారులు చెబుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: