ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 వేదికపై సాంకేతిక హంగుల మధ్య ఒక బాల మేధావి ఉనికి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ సదస్సులో అత్యంత పిన్న వయస్కుడైన స్పీకర్గా నిలిచిన రణ్వీర్ సన్దేవ, ఆధునిక కృత్రిమ మేధ (AI) రంగానికి సరికొత్త దిశానిర్దేశం చేస్తున్నారు. కేవలం కోడింగ్ లేదా అల్గారిథమ్స్ గురించి మాత్రమే కాకుండా, ప్రాచీన భారతీయ తత్వశాస్త్రాలను (Ancient Indian Philosophies) నేటి అత్యాధునిక టెక్నాలజీతో ఎలా అనుసంధానించవచ్చో ఆయన ఈ సదస్సులో వివరించనున్నారు. ప్రాచీన జ్ఞానాన్ని డిజిటల్ యుగానికి అన్వయిస్తూ రణ్వీర్ అందిస్తున్న విశ్లేషణలు శాస్త్రవేత్తలను సైతం ఆలోచింపజేస్తున్నాయి.
Sunitha: విడాకులు ఇచ్చిందనే కోపంతో హత్య చేసిన భర్త
ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు అభివృద్ధి చేస్తున్న ఏఐ మోడళ్లను క్షుణ్ణంగా పరిశీలించిన రణ్వీర్, భారతీయ ఏఐ నమూనాల ప్రత్యేకతను చాటిచెప్పారు. ముఖ్యంగా తాజాగా విడుదలైన ఇండియన్ ఏఐ మోడల్ కేవలం సాంకేతిక విప్లవానికే పరిమితం కాకుండా, దేశ జీడీపీ (GDP) వృద్ధికి ఎలా వెన్నుముకగా నిలుస్తుందో ఆయన గణాంకాలతో సహా వివరించనున్నారు. విదేశీ సాంకేతికతపై ఆధారపడకుండా, స్వదేశీ అవసరాలకు అనుగుణంగా ఏఐని మలచుకోవడం ద్వారా భారతదేశం ఆర్థికంగా ఎలా బలోపేతం అవుతుందనే అంశంపై ఆయన ఇచ్చే ప్రసంగం ఈ సమ్మిట్కే హైలైట్గా నిలవనుంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com