టీమిండియా ఈ ఏడాది స్వదేశంలో వెస్టిండీస్, దక్షిణాఫ్రికా జట్లతో సిరీస్లు ఆడనుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. అక్టోబరులో వెస్టిండీస్తో టెస్టు సిరీస్, నవంబరు-డిసెంబరులో దక్షిణాఫ్రికాతో టెస్టులు, వన్డేలు, టీ20 మ్యాచ్లు జరగనున్నాయి. ఈ మేరకు షెడ్యూల్ను విడుదల చేసింది.

భారత్లో వెస్టిండీస్ పర్యటన:
తొలి టెస్టు: అక్టోబరు 2-6, అహ్మదాబాద్
రెండో టెస్టు: అక్టోబరు 10-14, కోల్కతా
భారత్లో దక్షిణాఫ్రికా పర్యటన:
టెస్టు సిరీస్:
తొలి టెస్టు: నవంబరు 14-18, ఢిల్లీ
రెండో టెస్టు: నవంబరు 22-26, గువాహటి
వన్డే సిరీస్:
తొలి వన్డే: నవంబరు 30, రాంచీ
రెండో వన్డే: డిసెంబరు 3, రాయపూర్
మూడో వన్డే: డిసెంబరు 6, వైజాగ్
టీ20 సిరీస్:
తొలి టీ20: డిసెంబరు 9, కటక్
రెండో టీ20: డిసెంబరు 11, న్యూ ఛండీగఢ్
మూడో టీ20: డిసెంబరు 14, ధర్మశాల
నాలుగో టీ20: డిసెంబరు 17, లక్నో
ఐదో టీ20: డిసెంబరు 19, అహ్మదాబాద్
భారత అభిమానులు ఈ సిరీస్ల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రత్యేకంగా టెస్టు మ్యాచ్లు, వన్డేలు, టీ20లు సమిష్టిగా ఉంటుండటంతో క్రికెట్ ప్రేమికులకు భారీ వినోదం ఖాయమని అంచనా వేస్తున్నారు. భారత జట్టు తమ హోమ్ గ్రౌండ్లో ఎలా రాణిస్తుందో చూడాలి!